విశాఖ జిల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్లో రాయగడ రైలు బ్రేకుల నుంచి పొగలు రావటంతో ప్రయాణికులు ఆందోళ చెందారు. విషయాన్ని స్టేషన్లోని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది బ్రేక్ నుంచి పొగలు వస్తునట్లు గుర్తించి సమస్యను పరిష్కరించారు. బ్రేకులు పట్టేయడం వల్ల ఇలాంటి సమస్య వస్తుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు భయపడాల్సిన పనిలేదని తెలిపారు. అధికారుల భరోసాతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి:
కరోనా వలయంలో భారత్.. ఎక్కడ చూసినా ఆంక్షలే
రాష్ట్రంలో 21కి చేరిన కరోనా అనుమానిత కేసులు... నేడు సీఎం జగన్ సమీక్ష