విశాఖపట్నం ఆశవానిపాలెంలో ఉన్న టాస్ సంస్థ ప్రతిరోజూ 2 వేల మందికి ఆహార పొట్లాలు అందజేస్తోంది. 2014లో హరినారాయణ అనే యువకుడి ఆధ్వర్యంలో 26 మందితో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటివరకూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్తో ఇబ్బందిపడుతున్న పేదలు, మురికివాడల్లో నివసించే వారికి భోజనం పెడుతోంది. గత నెలరోజులుగా దాతల సహకారంతో రోజూ 2 వేల మందికి ఆహారం సమకూర్చుతున్నారు. రోజుకొక ప్రాంతంలో భోజనం పంపిణీ చేస్తూ దాతృత్వం చాటుతున్నారు.
ఇవీ చదవండి.. రైల్వేస్టేషన్లో వలయాలు... భౌతికదూరం పాటించేలా చర్యలు