విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయంలోకి.. ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీ స్థాయిలో వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ఎగువ నుంచి 1235 క్యూసెక్కుల నీరు వస్తోంది. అప్రమత్తమైన జల వనరుల శాఖ అధికారులు.. 2 గేట్లు ఎత్తి 1235 క్యూసెక్కుల వరద నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు.
దేవరాపల్లి మండలం రైవాడ జలాశయంలో వరద నీరు పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి 850 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. అధికారులు గేటు ఎత్తి 300 క్యూసెక్కుల వరద నీటిని శారదా నదిలోకి విడిచిపెట్టారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు.
ఇదీ చదవండి: