ETV Bharat / state

భయం గుప్పిట గిరిజనం.. ఏఓబీ సరిహద్దులో ఉద్రిక్తత

author img

By

Published : Jan 27, 2020, 12:05 PM IST

మావోయిస్టు మృతితో ఆంధ్రా - ఒడిశా స‌రిహ‌ద్దులో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఎప్పుడు ఏమవుతుందో అని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. భయంతో ఉన్న ఊరు వదిలి.. వలస పోతున్నారు.

Conditions worsed in Andhra-Odisha due to Maoist death
భయాందోళనలో ఆదివాసీలు
భయం గుప్పిట్లో ఆంధ్రా - ఒడిశా స‌రిహ‌ద్దు

ఆంధ్రా ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. మావోయిస్టులపై గ్రామస్థులు ఎదురు తిరగడం.. ఓ మావోయిస్టు మృతి చెందిన ఘటన అనంతరం.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏవోబీలోని చిత్రకొండ బ్లాక్ పరిధిలో ఉన్న జొడంబో పంచాయ‌తీ జొంతురాయి అట‌వీప్రాంతంలో... ర‌హ‌దారి ప‌నుల‌ను మావోయిస్టులు కొద్దిరోజులుగా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే... హెచ్చరించ‌డానికి వ‌చ్చిన మావోయిస్టుల‌పై స్థానికులు ఎదురుతిరిగారు. ఈ క్రమంలోనే దాడికి దిగారు. ఆడ్మా అనే మావోయిస్టును హతమార్చారు. ఘటనలో.. జిఫ్రోను అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మొట్టమొదటిసారి ఇంతగా మావోయిస్టుల‌పై గ్రామ‌స్థులు ఎదురు తిర‌గ‌డమే ఉద్రిక్తతకు కారణమైంది. ప్రతీకార దాడులకు దిగిన మావోయిస్టులు.. జొంతురాయిలోని ఇళ్లు, ద్విచ‌క్రవాహ‌నాల‌ను త‌గుల‌బెట్టారు.

పోలీసు బందోబస్తు

ఈ నేపథ్యంలో అధికారులు పెద్ద ఎత్తున సాయుధ‌ బ‌ల‌గాలను మోహరించారు. వివాదానికి కార‌ణ‌మైన ర‌హ‌దారి వ‌ద్ద.... గ‌స్తీ ఏర్పాటు చేశారు. ఎప్ప‌డు ఏం జ‌రుగుతుందోన‌న్న భ‌యాందోళ‌న‌తో జోడంబో, పనసపుట్, అండ్రాపల్లి ప్రజలు కొందరు... ఇతర ప్రాంతాల‌కు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం మల్కన్​గిరి జిల్లాలో పోలీసులు కూంబింగ్ నిర్విహిస్తున్నట్టు ఎస్పీ రిషికేశ్ డీ కీలారి తెలిపారు.

ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం...వాళ్లు సురక్షితంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నాం. ఆ ప్రాంతంలో క్యాంపు వేశాం...ప్రజల డిమాండ్లు సరైనవే ఐతే..వాటిని తీర్చే బాధ్యత మాపై ఉంది. మావోయిస్టుల స్వార్ధం బయటపడింది. ఆదివాసీల మధ్య ఘర్షణ సృష్టించారు. అది కాస్తా పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది.

- రిషికేశ్ డీ కీలారి. ఎస్పీ

ఇదీ చూడండి:

గిరిజనులు ఎదురుతిరిగారు... మావోయిస్టులు నిప్పుపెట్టారు..!

భయం గుప్పిట్లో ఆంధ్రా - ఒడిశా స‌రిహ‌ద్దు

ఆంధ్రా ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. మావోయిస్టులపై గ్రామస్థులు ఎదురు తిరగడం.. ఓ మావోయిస్టు మృతి చెందిన ఘటన అనంతరం.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏవోబీలోని చిత్రకొండ బ్లాక్ పరిధిలో ఉన్న జొడంబో పంచాయ‌తీ జొంతురాయి అట‌వీప్రాంతంలో... ర‌హ‌దారి ప‌నుల‌ను మావోయిస్టులు కొద్దిరోజులుగా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే... హెచ్చరించ‌డానికి వ‌చ్చిన మావోయిస్టుల‌పై స్థానికులు ఎదురుతిరిగారు. ఈ క్రమంలోనే దాడికి దిగారు. ఆడ్మా అనే మావోయిస్టును హతమార్చారు. ఘటనలో.. జిఫ్రోను అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మొట్టమొదటిసారి ఇంతగా మావోయిస్టుల‌పై గ్రామ‌స్థులు ఎదురు తిర‌గ‌డమే ఉద్రిక్తతకు కారణమైంది. ప్రతీకార దాడులకు దిగిన మావోయిస్టులు.. జొంతురాయిలోని ఇళ్లు, ద్విచ‌క్రవాహ‌నాల‌ను త‌గుల‌బెట్టారు.

పోలీసు బందోబస్తు

ఈ నేపథ్యంలో అధికారులు పెద్ద ఎత్తున సాయుధ‌ బ‌ల‌గాలను మోహరించారు. వివాదానికి కార‌ణ‌మైన ర‌హ‌దారి వ‌ద్ద.... గ‌స్తీ ఏర్పాటు చేశారు. ఎప్ప‌డు ఏం జ‌రుగుతుందోన‌న్న భ‌యాందోళ‌న‌తో జోడంబో, పనసపుట్, అండ్రాపల్లి ప్రజలు కొందరు... ఇతర ప్రాంతాల‌కు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం మల్కన్​గిరి జిల్లాలో పోలీసులు కూంబింగ్ నిర్విహిస్తున్నట్టు ఎస్పీ రిషికేశ్ డీ కీలారి తెలిపారు.

ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం...వాళ్లు సురక్షితంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నాం. ఆ ప్రాంతంలో క్యాంపు వేశాం...ప్రజల డిమాండ్లు సరైనవే ఐతే..వాటిని తీర్చే బాధ్యత మాపై ఉంది. మావోయిస్టుల స్వార్ధం బయటపడింది. ఆదివాసీల మధ్య ఘర్షణ సృష్టించారు. అది కాస్తా పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది.

- రిషికేశ్ డీ కీలారి. ఎస్పీ

ఇదీ చూడండి:

గిరిజనులు ఎదురుతిరిగారు... మావోయిస్టులు నిప్పుపెట్టారు..!

Intro:AP_VSP_57_26_AOB_LO_VUDRIKTAM_AVB_AP10153Body:

ఏవోబీలో ఉద్రిక్తం
క‌టాఫ్ ఏరియాకు చేరుకున్న పోలీసుబ‌ల‌గాలు
భ‌యాందోళ‌న‌లో గిరిజ‌నులు
మావోయిస్టుల‌కు పెట్ట‌ని కోట‌గా ఉన్న ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల‌కు పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. మొట్ట‌మొదటిసారిగా మావోయిస్టుల‌పై గ్రామ‌స్థులు ఎదురుతిర‌గ‌డంతో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ర‌హ‌దారి నిర్మాణం అడ్డుకున్నందుకు మావోయిస్టుల‌పై గ్రామ‌స్థులు తిర‌గ‌బ‌డి ఒక మావోయిస్టును హ‌త‌మార్చ‌గా, దీనికి ప్ర‌తీకారంగా మావోయిస్టులు గ్రామంపై దాడి చేసి ఇళ్లు త‌గుల‌బెట్టారు. దీంతో స‌రిహ‌ద్దుల్లో ఎప్పుడు ఏమి జ‌రుగుతుందోన‌ని భ‌యాందోళ‌న‌లు వెంటాడుతున్నాయి. ఆంద్రా ఒడిశా రాష్ట్రంలోని చిత్రకొండ బ్లాక్ పరిధిలో జొడంబో పంచాయ‌తీ జొంతురాయి అట‌వీప్రాంతంలో జ‌రుగుతున్న ర‌హ‌దారి నిర్మాణ ప‌నుల‌ను మావోయిస్టులు గ‌త కొద్ది రోజులుగా వ్య‌తిరేఖిస్తున్నారు. ఇందులో భాగంగా గిరిజ‌నుల‌ను హెచ్చ‌రించ‌డానికి వ‌చ్చిన మావోయిస్టుల‌పై గ్రామ‌స్థులు ఎదురుతిరిగారు. దీంతో ఇరువ‌ర్గాలు మ‌ద్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో మావోయిస్టు పార్టీ గుమ్మ ఏరియా క‌మిటీ స‌బ్యుడు హాద్మ మృతి చెంద‌గా, నంద‌పూర్ ఏరియా క‌మిటీ స‌బ్యుడు జిపోకుమ తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ సంఘ‌ట‌న‌తో రెచ్చిపోయిన మావోయిస్టులు పెద్ద ఎత్తున జంతురాయి గ్రామం మీద‌కు దాడికి దిగారు. ర‌హ‌దారి నిర్మాణానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారు, మావోయిస్టుల‌కు వ్య‌తిరేఖంగా ఉన్న వారి ఇళ్లుల‌ను, ద్విచ‌క్ర‌వాహ‌నాల‌నుఈ మావోయిస్టులు త‌గుల‌బెట్టారు. ఈ సంఘ‌ట‌న‌తో ఏవోబీలో ప‌రిస్థ‌తి ఉద్రిక్తంగా మారింది. పెద్ద ఎత్తున సాయుధ‌బ‌ల‌గాను ఏవోబీలోని క‌టాఫ్ ఏరియా ప్రాంతానికి త‌ర‌లించారు. జంతురాయి గ్రామ ప‌రిస‌రాల్లో బీఎస్ఎఫ్ బ‌ల‌గాల‌తో బందోబ‌స్తు నిర్వ‌హిస్తుండ‌గా, ఎస్‌వోజీ. డీవీఎఫ్‌, కోబ్రా బ‌ల‌గాల‌తో గాలింపు చ‌ర్య‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. వివాదానికి కార‌ణ‌మైన ర‌హ‌దారి వ‌ద్ద బీఎస్ఎఫ్ బ‌ల‌గాల‌తో గ‌స్తీ ఏర్పాటుచేశారు. జంతురాయిలో జ‌రిగిన సంఘ‌ట‌న‌తో జోడంభో, పనసపుట్, అండ్రాపల్లి పంచాయతీల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎప్ప‌డు ఏమి జ‌రుగుతుందోన‌న్న భ‌యాందోళ‌న‌లు గిరిజ‌నుల‌ను వెంటాడుతున్నాయి. కొంత‌మంది గిరిజ‌నులైతే గ్రామాల్లోని త‌మ ఇళ్లుల‌ను వ‌దిలి వేరే ప్రాంతాల‌కు వ‌ల‌స వెళ్లిపోతున్నారు.దీనిపై మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఎస్పీ మాట్ల‌డుతూ జోడంభో పంచాయతీలోని జంతురాయి గ్రామంలో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న మావోయిస్టులకు ప్రజలు ఎదురుతిరిగారని. గ్రామస్థుల దాడిలో ఒక మావోయిస్టు మృతిచెంద‌గా, మ‌రొక మావోయిస్టుకు తీవ్ర‌గాయాల‌య్యావ‌ని, ప్రతీకారంగా ఆ గ్రామంలోని గిరిజనుల ఇళ్లకు, ద్విచక్ర వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టారని ప్రస్తుతం మల్కన్గిరి జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు అక్కడి ఎస్పీ రిషికేశ్ డి కిలారి తెలిపారు.


Conclusion:M Ramanarao, AP10153
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.