ETV Bharat / state

డాక్టర్​ సుధాకర్ కేసు....దర్యాప్తు పురోగతిపై సీబీఐ నివేదిక

author img

By

Published : Nov 18, 2020, 5:05 AM IST

నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మత్తు వైద్యుడు సుధాకర్ కేసులో దర్యాప్తు పురోగతిని సీల్డ్ కవర్​లో రెండో స్థాయి నివేదికను సమర్పించినట్లు హైకోర్టుకు సీబీఐ తెలిపింది. కేసు సున్నితత్వం వల్ల దర్యాప్తు వివరాల్ని బహిర్గతం చేయలేమని సీబీఐ తెలిపింది. ఈ కేసు విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

dr sudhar case
dr sudhar case

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మత్తు వైద్యుడు సుధాకర్ కేసులో దర్యాప్తు పురోగతిని తెలియజేస్తూ సీల్డ్ కవర్​లో రెండో స్థాయి నివేదికను సమర్పించినట్లు హైకోర్టుకు సీబీఐ తెలిపింది. కేసు సున్నితత్వం వల్ల దర్యాప్తు వివరాల్ని బహిర్గతం చేయలేమని పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన నివేదిక కేసు ఫైల్​లో చేరకపోవడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

విశాఖ పోలీసులు డాక్టర్ సుధాకర్‌తో వ్యవహరించిన తీరుపై వీడియో క్లిప్పింగ్​ను జత చేస్తూ తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను సుమోటో గా పరిగణించిన హైకోర్టు గత మే 22న సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. బాధ్యులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని స్పష్టం చేసింది. ఈ ఘటనలో కుట్ర కోణం దాగుందేమో తేల్చాలని పేర్కొంది. తాజాగా జరిగిన విచారణలో సీబీఐ పీపీ చెన్న కేశవులు వాదనలు వినిపిస్తూ రెండో స్థాయి నివేదికను సీల్డ్ కవర్​లో హైకోర్టుకు సమర్పించామన్నారు. దర్యాప్తు స్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా .. కేసు సున్నితత్వం వల్ల వివరాల్ని బహిర్గతం చేయలేమన్నారు.

ఇదీ చదవండి : కోర్టులపై అభ్యంతరకర పోస్టులు.. సీబీఐ దర్యాప్తు ప్రారంభం

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మత్తు వైద్యుడు సుధాకర్ కేసులో దర్యాప్తు పురోగతిని తెలియజేస్తూ సీల్డ్ కవర్​లో రెండో స్థాయి నివేదికను సమర్పించినట్లు హైకోర్టుకు సీబీఐ తెలిపింది. కేసు సున్నితత్వం వల్ల దర్యాప్తు వివరాల్ని బహిర్గతం చేయలేమని పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన నివేదిక కేసు ఫైల్​లో చేరకపోవడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

విశాఖ పోలీసులు డాక్టర్ సుధాకర్‌తో వ్యవహరించిన తీరుపై వీడియో క్లిప్పింగ్​ను జత చేస్తూ తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను సుమోటో గా పరిగణించిన హైకోర్టు గత మే 22న సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. బాధ్యులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని స్పష్టం చేసింది. ఈ ఘటనలో కుట్ర కోణం దాగుందేమో తేల్చాలని పేర్కొంది. తాజాగా జరిగిన విచారణలో సీబీఐ పీపీ చెన్న కేశవులు వాదనలు వినిపిస్తూ రెండో స్థాయి నివేదికను సీల్డ్ కవర్​లో హైకోర్టుకు సమర్పించామన్నారు. దర్యాప్తు స్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా .. కేసు సున్నితత్వం వల్ల వివరాల్ని బహిర్గతం చేయలేమన్నారు.

ఇదీ చదవండి : కోర్టులపై అభ్యంతరకర పోస్టులు.. సీబీఐ దర్యాప్తు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.