ETV Bharat / state

మన్యం లోయలో బొలెరో వాహనం బోల్తా.. ఇద్దరు మృతి - Bolero vehicle overturns news

విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం గ్రామ సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

Bolero vehicle overturns in Manyam
బొలెరో వాహనం బోల్తా
author img

By

Published : Jan 10, 2021, 7:22 PM IST

విశాఖ మన్యంలో బొలెరో వాహనం లోయలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిరు వ్యాపారులు మృతి చెందారు. చిక్కుళ్లు కొనుగోలు చేసేందుకు లోతుగెడ్డ నుంచి బలపం మీదుగా కోరుకొండ సంతకు వెళ్తుండగా కృష్ణవరం ఘాట్​ రోడ్డు మలుపు వద్ద వాహనం అదుపుతప్పింది. బొలెరోపై కూర్చున్న ఇద్దరు వ్యక్తులు లోయలో పడి మృతి చెందారు. మరణించిన వారు బలపం గ్రామానికి చెందిన బచ్చలి వీరయ్య దొర, రాళ్లగడ్డకు చెందిన కొర్ర కామేశ్​గా గుర్తించారు. వాహనం నడిపిన యువకుడితో మృతుడి బంధువులు వాగ్వాదానికి దిగారు. మృతదేహాలను చింతపల్లి ఆస్పత్రికి తరలించారు.

విశాఖ మన్యంలో బొలెరో వాహనం లోయలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిరు వ్యాపారులు మృతి చెందారు. చిక్కుళ్లు కొనుగోలు చేసేందుకు లోతుగెడ్డ నుంచి బలపం మీదుగా కోరుకొండ సంతకు వెళ్తుండగా కృష్ణవరం ఘాట్​ రోడ్డు మలుపు వద్ద వాహనం అదుపుతప్పింది. బొలెరోపై కూర్చున్న ఇద్దరు వ్యక్తులు లోయలో పడి మృతి చెందారు. మరణించిన వారు బలపం గ్రామానికి చెందిన బచ్చలి వీరయ్య దొర, రాళ్లగడ్డకు చెందిన కొర్ర కామేశ్​గా గుర్తించారు. వాహనం నడిపిన యువకుడితో మృతుడి బంధువులు వాగ్వాదానికి దిగారు. మృతదేహాలను చింతపల్లి ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: ఎన్నికలు నిర్వహిస్తామంటే ఎందుకు భయపడుతున్నారు?: వంగలపూడి అనిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.