ETV Bharat / state

కారులో 55 కిలోల గంజాయి గుర్తింపు .. నలుగురు అరెస్ట్

విశాఖలో అక్రమంగా తరలిస్తున్న 55 కిలోల గంజాయిని కొత్తకోట పోలీసులు గుర్తించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : May 4, 2021, 2:43 PM IST

Crime
Crime

విశాఖ జిల్లా రావికమతం మండలం కొత్తకోట పోలీసులు 55 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. కొత్తకోట ఎస్సై నాగ కార్తీక్ తెలిపిన వివరాల ప్రకారం.. భీమునిపట్నం - నర్సీపట్నం రోడ్డులో ప్లాస్టిక్ సంచులలో నింపిన 55 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు తనిఖీలు నిర్వహించారు.

కేరళ రిజిస్ట్రేషన్ నెంబర్​తో ప్రయాణిస్తున్న కారులో గంజాయిని గుర్తించారు. కారును సీజ్ చేసి.. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ. 3 వేల నగదు, ఐదు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని కేరళ రాష్ట్రానికి చెందిన నవాజ్, అబ్దుల్, మునీర్, మహమ్మద్ నిషాద్ లుగా గుర్తించారు.

విశాఖ జిల్లా రావికమతం మండలం కొత్తకోట పోలీసులు 55 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. కొత్తకోట ఎస్సై నాగ కార్తీక్ తెలిపిన వివరాల ప్రకారం.. భీమునిపట్నం - నర్సీపట్నం రోడ్డులో ప్లాస్టిక్ సంచులలో నింపిన 55 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు తనిఖీలు నిర్వహించారు.

కేరళ రిజిస్ట్రేషన్ నెంబర్​తో ప్రయాణిస్తున్న కారులో గంజాయిని గుర్తించారు. కారును సీజ్ చేసి.. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ. 3 వేల నగదు, ఐదు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని కేరళ రాష్ట్రానికి చెందిన నవాజ్, అబ్దుల్, మునీర్, మహమ్మద్ నిషాద్ లుగా గుర్తించారు.

ఇదీ చదవండి:

తిరుమలలో అగ్నిప్రమాదం... ఆరు దుకాణాలు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.