ETV Bharat / state

పాతాలి నదిలో ఆటో, కారు గల్లంతు...ఒకరు మృతి

author img

By

Published : Nov 4, 2020, 7:44 AM IST

ఆటో, కారు ఢీకొని పాతాలి నదిలో పడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా...నలుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా పాడువా సమీపంలో జరిగింది.

Mastyagedda river
మాస్త్యగెడ్డ నదిలో ఆటో, కార్ గల్లంతు

ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా పాడువా సమీపంలో పాతాలి నదిలో మంగళవారం రాత్రి రెండు వాహనాలు పడి నలుగురు గల్లంతయ్యారు. విశాఖపట్నానికి చెందిన నలుగురు కారులో పాడువవైపు నుంచి బయలుదేరారు. అరకు నుంచి పాడువా వైపునకు వెళ్తున్న ఆటో, వీరి కారు డర్లీపుట్‌ సమీపంలోని పూజారిపుట్‌ గ్రామం వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో పక్కనే వున్న పాతాళి నదిలో వాహనాలు పడిపోయాయి. అటోలో ఉన్న నలుగురు ప్రాణాలతో బయట పడ్డారు. కారులో ఉన్నవారు మాత్రం నదిలో గల్లంతయ్యారు.

పాడువ పోలీసులకు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది సహాయంతో నదిలో గాలిస్తున్నారు. రాత్రి 9.30 గంటలకు ఒక యువతి మృతదేహం లభ్యమయింది. మిగతా వారి కోసం శ్రమిస్తున్నారు. రాత్రివేళ కావడంతో చీకటిలో గాలింపు ఇబ్బందికరంగా మారింది.

ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా పాడువా సమీపంలో పాతాలి నదిలో మంగళవారం రాత్రి రెండు వాహనాలు పడి నలుగురు గల్లంతయ్యారు. విశాఖపట్నానికి చెందిన నలుగురు కారులో పాడువవైపు నుంచి బయలుదేరారు. అరకు నుంచి పాడువా వైపునకు వెళ్తున్న ఆటో, వీరి కారు డర్లీపుట్‌ సమీపంలోని పూజారిపుట్‌ గ్రామం వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో పక్కనే వున్న పాతాళి నదిలో వాహనాలు పడిపోయాయి. అటోలో ఉన్న నలుగురు ప్రాణాలతో బయట పడ్డారు. కారులో ఉన్నవారు మాత్రం నదిలో గల్లంతయ్యారు.

పాడువ పోలీసులకు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది సహాయంతో నదిలో గాలిస్తున్నారు. రాత్రి 9.30 గంటలకు ఒక యువతి మృతదేహం లభ్యమయింది. మిగతా వారి కోసం శ్రమిస్తున్నారు. రాత్రివేళ కావడంతో చీకటిలో గాలింపు ఇబ్బందికరంగా మారింది.

ఇదీ చదవండీ...

'బోటు ప్రమాదాలు జరగకుండా కమాండ్ కంట్రోల్ కేంద్రం పర్యవేక్షణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.