ETV Bharat / state

ఉత్తరాంధ్రలో ప్రారంభంకానున్న అమూల్​ పాల సేకరణ యూనిట్ - milk collection unit news

పాడి రైతులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. 'అమూల్' డెయిరీ సహకారంతో దశల వారీగా వివిధ ప్రాంతాల్లో పాల సేకరణకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మొదలైన ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో యూనిట్ల ప్రారంభానికి చర్యలు చేపడుతున్నారు.

Amul milk collection
పాడి రైతులకు చేయూత
author img

By

Published : Dec 15, 2020, 12:32 PM IST

అమూల్​ డెయిరీ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పాల సేకరణ యూనిట్లను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో డెయిరీలు ఏర్పాటు చేశారు. అదే స్ఫూర్తితో ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను కలిపి ఒక యూనిట్​గా తీసుకుని ఈ పథకానికి శ్రీకారం చుట్టేందుకు చర్యలు చేపడుతున్నారు.

పాడి రైతులకు చేయూతనిచ్చేందుకు అముల్​ డెయిరీ యూనిట్ల ప్రారంభంతో పాటు..పాల ధర లీటరుకు నాలుగు రూపాయలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని మహిళా పాడి రైతులకు వైఎస్సార్ చేయూత పథకం కింద రాయితీపై పాడిపశువులను అందజేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం వెలుగు కార్యాలయం ద్వారా జిల్లా పశు సంవర్ధక శాఖ సహకారంతో మేలుజాతి పశువులను సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అమూల్​ డెయిరీ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పాల సేకరణ యూనిట్లను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో డెయిరీలు ఏర్పాటు చేశారు. అదే స్ఫూర్తితో ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను కలిపి ఒక యూనిట్​గా తీసుకుని ఈ పథకానికి శ్రీకారం చుట్టేందుకు చర్యలు చేపడుతున్నారు.

పాడి రైతులకు చేయూతనిచ్చేందుకు అముల్​ డెయిరీ యూనిట్ల ప్రారంభంతో పాటు..పాల ధర లీటరుకు నాలుగు రూపాయలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని మహిళా పాడి రైతులకు వైఎస్సార్ చేయూత పథకం కింద రాయితీపై పాడిపశువులను అందజేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం వెలుగు కార్యాలయం ద్వారా జిల్లా పశు సంవర్ధక శాఖ సహకారంతో మేలుజాతి పశువులను సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఉపా చట్టం కేసు వ్యవహారంలో.. అన్నపూర్ణ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.