ETV Bharat / state

'బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కొనసాగించాలి' - Ambedkar Vidyardhi Sangam Agitation

రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విద్యార్థి సంఘం విశాఖలో ఆందోళన చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాల వారికి మెరుగైన విద్యను అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.

Ambedkar Vidyardhi Sangam Agitation
అంబేద్కర్ విద్యార్థి సంఘం ఆందోళన
author img

By

Published : Oct 19, 2020, 3:36 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో అంబేద్కర్ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. డాబాగార్డెన్స్ లోని అంబేద్కర్​ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. రెండు నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులను కూడా ఈ పథకంలో చేర్చాలని కోరారు.

దళిత విద్యార్థులను విద్యకు దూరం చేసే ఉద్దేశ్యంతో వైకాపా ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, దళిత, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పథకాన్ని యధావిధిగా కొనసాగించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో అంబేద్కర్ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. డాబాగార్డెన్స్ లోని అంబేద్కర్​ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. రెండు నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులను కూడా ఈ పథకంలో చేర్చాలని కోరారు.

దళిత విద్యార్థులను విద్యకు దూరం చేసే ఉద్దేశ్యంతో వైకాపా ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, దళిత, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పథకాన్ని యధావిధిగా కొనసాగించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఉపఖండం ఆవిర్భావం వెనుక ఆసక్తికర విషయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.