ETV Bharat / state

ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండం.. 24 గంటల్లో వర్షాలు - _depression over bay of bengal

ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతవరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఉత్తరబంగాళాఖాతంలో వాయుగుండం... రాగల 24 గంటల్లో వర్షాలు
author img

By

Published : Aug 6, 2019, 5:54 PM IST

ఉత్తరబంగాళాఖాతంలో వాయుగుండం... రాగల 24 గంటల్లో వర్షాలు

ఒడిశా-పశ్చిమ బంగా తీరాలకు దగ్గరగా ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని బాలాసోర్​కు 160 కిలోమీటర్లు, పశ్చిమ బంగాల్లోని దిఘాకు 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం తెలియచేసింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, ఒడిశా, పశ్చిమ బంగా, చత్తీస్​గడ్​, తెలంగాణ రాష్ట్రాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఈ రాష్ట్రాల్లో 20 సెంటిమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ స్పష్టం చేసింది. ఇక వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా, పశ్చిమ బంగా తీర ప్రాంతాల్లో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

ఉత్తరబంగాళాఖాతంలో వాయుగుండం... రాగల 24 గంటల్లో వర్షాలు

ఒడిశా-పశ్చిమ బంగా తీరాలకు దగ్గరగా ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ప్రస్తుతం ఇది ఒడిశాలోని బాలాసోర్​కు 160 కిలోమీటర్లు, పశ్చిమ బంగాల్లోని దిఘాకు 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం తెలియచేసింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, ఒడిశా, పశ్చిమ బంగా, చత్తీస్​గడ్​, తెలంగాణ రాష్ట్రాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఈ రాష్ట్రాల్లో 20 సెంటిమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ స్పష్టం చేసింది. ఇక వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా, పశ్చిమ బంగా తీర ప్రాంతాల్లో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

ఇవీ చదవండి

గోదారి వరద తగ్గినా.. ముంపు ముప్పు తీరలేదు!

Intro:ap_rjy_62_11_jathara_mahotsavaalu_av_c10 ..617


Body:తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు( మండలం) లో వేగుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ రాత్రి నుండి ప్రారంభించారు.. జాతర సంధర్భంగా కోలాటం ఏర్పాటు చేశారు..రేపు అమ్మవారి తీర్ధం నిర్వహిస్తారు..గరగలు తీసి రాత్రంతా జాతర కొనసాగిస్తారు..అమ్మవారి ఆలయం పరిసరాలు దీపాలతో అలంకరించారు... భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.. శ్రీనివాస్ ప్రతిపాడు 617


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.