ETV Bharat / state

స్టీల్ ప్లాంట్ రక్షణకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమే: ఎంపీ రామ్మోహన్​ - విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎంపీ రామ్మోహన్​నాయుడు తాజా వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటీకరణను ఆపాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. తెదేపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో కలిసి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితర తెదేపా నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

tdp protest against visakha steel plant privatization
ఏడు రోడ్ల కూడలిలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన
author img

By

Published : Feb 18, 2021, 5:29 PM IST

Updated : Feb 18, 2021, 6:12 PM IST

స్టీల్ ప్లాంట్ రక్షణకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమే: ఎంపీ రామ్మోహన్​

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా ఎంపీలు రాజీనామా చేసిన క్షణంలో.. తాము కూడా రాజీనామా చేస్తామని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. అప్పట్లో స్టీల్ ప్లాంట్‌కు భూములు ఇచ్చింది.. ప్లాంట్ విస్తరణకే తప్ప అమ్ముకోవడానికి కాదని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ పోరాటానికి నాయకత్వం వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే చంద్రబాబు పిలుపునిచ్చారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే హక్కు సీఎంకు మాత్రమే ఉందని తెలిపారు. ప్రైవేటుగా స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే ఇడుపులపాయలోని భూముల్లో పెట్టండని సలహా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు ఎలాంటి త్యాగాలకైన సిద్ధమేనని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:

త్వరలోనే రాష్ట్ర వ్యాప్త బంద్​కు పిలుపు: సీపీఐ రామకృష్ణ

స్టీల్ ప్లాంట్ రక్షణకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమే: ఎంపీ రామ్మోహన్​

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా ఎంపీలు రాజీనామా చేసిన క్షణంలో.. తాము కూడా రాజీనామా చేస్తామని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. అప్పట్లో స్టీల్ ప్లాంట్‌కు భూములు ఇచ్చింది.. ప్లాంట్ విస్తరణకే తప్ప అమ్ముకోవడానికి కాదని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ పోరాటానికి నాయకత్వం వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే చంద్రబాబు పిలుపునిచ్చారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే హక్కు సీఎంకు మాత్రమే ఉందని తెలిపారు. ప్రైవేటుగా స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే ఇడుపులపాయలోని భూముల్లో పెట్టండని సలహా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు ఎలాంటి త్యాగాలకైన సిద్ధమేనని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:

త్వరలోనే రాష్ట్ర వ్యాప్త బంద్​కు పిలుపు: సీపీఐ రామకృష్ణ

Last Updated : Feb 18, 2021, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.