ETV Bharat / state

ఎన్నికల కమిషన్​ను ప్రశ్నించే అధికారం మీకెక్కడిది..? - tdp leaders complaint agaist ycp at nellore

వైకాపా నేతలు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటూ విలువలు కాలరాస్తున్నారని తెదేపా నేత కూన రవికూమార్​ విమర్శించారు. ఎన్నికల కమిషన్​ను ప్రశ్నించే అధికారం ముఖ్యమంత్రికి లేదని ఆయన అన్నారు. మరోవైపు స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చాలా చోట్ల అక్రమాలు జరిగాయంటూ తెదేపా నేతలు ఆరోపించారు. కడప జిల్లాలో రిజర్వేషన్లు సక్రమంగా లేవంటూ స్థానిక తెదేపా నేతలు కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లారు. నెల్లూరులో పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఎన్నికల కమిషన్​ను ప్రశ్నించే అధికారం మీకెక్కడిది..?
ఎన్నికల కమిషన్​ను ప్రశ్నించే అధికారం మీకెక్కడిది..?
author img

By

Published : Mar 17, 2020, 11:51 AM IST

రిజర్వేషన్ల తప్పులతడకగా ఉన్నాయని కలెక్టర్​కు ఫిర్యాదు
పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఎస్పీకి తెదేపా నేతల ఫిర్యాదు

ఎన్నికల కమిషన్​ను తప్పుబట్టే అధికారం ముఖ్యమంత్రి జగన్​కు లేదని తెదేపా నేత రవికుమార్​ అన్నారు. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. స్పీకర్​ తమ్మినేని సీతారాం రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా వైరస్​ వచ్చిన తర్వాత.. జరిగే నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అని నిలదీశారు. స్థానిక ఎన్నికల్లో అధికారుల అండతో అరాచకాలు చేశారని మండిపడ్డారు.

కడప జిల్లాలో రిజర్వేషన్లపై తెదేపా ఫిర్యాదు

కడప జిల్లాలో గ్రామ పంచాయతీ రిజర్వేషన్ల కేటాయింపులో చాలా అవకతవకలు జరిగాయని కమలాపురం తెదేపా ఇంఛార్జీ పుత్తా నరసింహారెడ్డి ఆక్షేపించారు. ఎస్సీ, బీసీలు ఎక్కువగా ఉన్నచోట ఓసీలకు...., ఎస్సీలు, బీసీలు తక్కువగా ఉన్న చోట బీసీలకు కేటాయిస్తూ రిజర్వేషన్లు ఇచ్చారని ఆయన జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా పడటంతో రిజర్వేషన్లు మార్చాలని ఆయన డిమాండ్​ చేశారు. పోలీసులపై ఫిర్యాదు చేసిన తమకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. వీటన్నింటిపై జిల్లా ఎన్నికల అధికారులతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని అన్నారు.

నెల్లూరులో బెదిరింపులపై ఫిర్యాదు

నెల్లూరు జిల్లాలో స్థానిక ఎన్నికల్లో వైకాపా అరాచకాలకు పాల్పడిందని తెదేపా నేతలు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్​కు ఫిర్యాదు చేశారు. తెదేపా అభ్యర్ధులు నామినేషన్ వేయకుండా వైకాపా నేతలు అడ్డుకున్నారని.., బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర కోరారు.

ఇదీ చూడండి:

అమరావతికి మద్దతుగా ప్రకటన వచ్చే వరకు పోరు ఆగదు !

రిజర్వేషన్ల తప్పులతడకగా ఉన్నాయని కలెక్టర్​కు ఫిర్యాదు
పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఎస్పీకి తెదేపా నేతల ఫిర్యాదు

ఎన్నికల కమిషన్​ను తప్పుబట్టే అధికారం ముఖ్యమంత్రి జగన్​కు లేదని తెదేపా నేత రవికుమార్​ అన్నారు. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. స్పీకర్​ తమ్మినేని సీతారాం రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా వైరస్​ వచ్చిన తర్వాత.. జరిగే నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అని నిలదీశారు. స్థానిక ఎన్నికల్లో అధికారుల అండతో అరాచకాలు చేశారని మండిపడ్డారు.

కడప జిల్లాలో రిజర్వేషన్లపై తెదేపా ఫిర్యాదు

కడప జిల్లాలో గ్రామ పంచాయతీ రిజర్వేషన్ల కేటాయింపులో చాలా అవకతవకలు జరిగాయని కమలాపురం తెదేపా ఇంఛార్జీ పుత్తా నరసింహారెడ్డి ఆక్షేపించారు. ఎస్సీ, బీసీలు ఎక్కువగా ఉన్నచోట ఓసీలకు...., ఎస్సీలు, బీసీలు తక్కువగా ఉన్న చోట బీసీలకు కేటాయిస్తూ రిజర్వేషన్లు ఇచ్చారని ఆయన జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా పడటంతో రిజర్వేషన్లు మార్చాలని ఆయన డిమాండ్​ చేశారు. పోలీసులపై ఫిర్యాదు చేసిన తమకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. వీటన్నింటిపై జిల్లా ఎన్నికల అధికారులతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని అన్నారు.

నెల్లూరులో బెదిరింపులపై ఫిర్యాదు

నెల్లూరు జిల్లాలో స్థానిక ఎన్నికల్లో వైకాపా అరాచకాలకు పాల్పడిందని తెదేపా నేతలు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్​కు ఫిర్యాదు చేశారు. తెదేపా అభ్యర్ధులు నామినేషన్ వేయకుండా వైకాపా నేతలు అడ్డుకున్నారని.., బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర కోరారు.

ఇదీ చూడండి:

అమరావతికి మద్దతుగా ప్రకటన వచ్చే వరకు పోరు ఆగదు !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.