ETV Bharat / state

మద్యం, నాటుసారా అక్రమ రవాణాపై నిఘా

author img

By

Published : Jan 31, 2021, 2:23 PM IST

తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుండటంతో...ఓటర్లను ప్రలోభ పెట్టడానికి మద్యం, డబ్బును ఎరగా ఉపయోగించాలని బడా నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి సిక్కోలు పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

srikaulam
మద్యం, నాటుసారా అక్రమ రవాణాపై నిఘా

శ్రీకాకుళం జిల్లాలో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. నేటితో నామినేషన్ల గడువు పూర్తవుతుంది. ఆ తర్వాత నామినేషన్లు వేసినవారు ఉపసంహరించుకోవడానికి, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి మద్యం, డబ్బును ఎరగా ఉపయోగించాలని బడా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా తాము ఎంపిక చేసిన వ్యక్తే చివరికి బరిలో నిలుస్తారని కుయుక్తులు పన్నుతున్నారు. ఈ క్రమంలో భారీఎత్తున అక్రమ మద్యం, నాటుసారా జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు ముందస్తుగానే అంచనా వేశాయి. ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి సరిహద్దు మండలాలైన ఇచ్ఛాపురం, మందస, కొత్తూరు, మెళియాపుట్టి, పాతపట్నం, తదితర ప్రాంతాల్లో చెక్‌పోస్టులను మరింత బలోపేతం చేశారు. జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఏమీ లేవని నిర్ధారించుకున్న తర్వాతే వాహనాన్ని వదులుతున్నారు.

పొరుగు రాష్ట్రం నుంచి....

లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయిన కొందరు సులువుగా డబ్బు సంపాదించడానికి మద్యం అక్రమ రవాణాయే పనిగా పెట్టుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా వారు మానడం లేదు. ఇక్కడి మద్యం ధరలు పొరుగు రాష్ట్రంతో పోలిస్తే కొంత ఎక్కువే. అందుకే బరిలో నిలిచే అభ్యర్థులు కూడా పొరుగు రాష్ట్రం నుంచి పెద్దఎత్తున మద్యం అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ మద్యాన్నే ఎరగా చూపి ఓటర్లను తమవైపునకు తిప్పుకోవాలనేదే అభ్యర్థుల లక్ష్యం. సాధారణ రోజుల్లోనే వందల మంది యువకులు, వ్యాపారస్తులు మద్యం అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడేవారు. ఇప్పుడు అలాంటి వారంతా మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వారి కదలికలపైనా నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.

ఆధారాలు చూపకపోతే అదుపులోకే...

పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో దాదాపు జిల్లా అంతటా ఎన్నికల నియమావళి అమలులో ఉంది. పోలీసు వర్గాలు చెక్‌పోస్టుల దగ్గరే కాకుండా ఎక్కడికక్కడ వాహనాలు ఆపి తనిఖీ చేస్తున్నారు. పెద్దమొత్తంలో డబ్బు తరలించే వారినీ ఆరా తీస్తున్నారు. తీసుకెళ్తున్న డబ్బుకు తగిన ఆధారాలు చూపకపోతే వెంటనే ఆ మొత్తాన్ని సీజ్‌ చేసి బాధ్యులను అదుపులోకి తీసుకుంటున్నారు. అత్యవసరాల దృష్ట్యా ఎవరైనా ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్లాల్సి వస్తే అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే చిక్కులు ఎదుర్కోక తప్పదని పోలీసు వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

తలనొప్పిగా సారా తయారీ

జిల్లాలో నాటుసారా తయారీని అరికట్టడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తిస్థాయిలో ఫలితమివ్వట్లేదు. స్థానికంగా దొరికే నాటుసారా ఒకెత్తయితే పొరుగు రాష్ట్రం నుంచి సముద్ర మార్గం ద్వారా వచ్చేది జిల్లా పోలీసులకు మరో పెద్ద తలనొప్పిగా తయారైంది. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు పక్క రాష్ట్రంలో, రాష్ట్ర సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు జాయింట్‌ ఆపరేషన్లు కూడా నిర్వహించారు. కానీ అక్కడ పూర్తిస్థాయిలో నిలువరించడానికి జిల్లా పోలీసులకు అధికారం లేదు. ఫలితంగా పక్క రాష్ట్రం నుంచి సముద్ర మార్గం ద్వారా నాటుసారా రవాణా అధికంగా ఉంటోంది. దీన్ని అరికట్టడానికి పోలీసులు తీర ప్రాంతాల్లోనూ గస్తీ ముమ్మరం చేశారు.


ఇదీ చదవండి : రిజర్వేషన్ల తంట.. ఓట్లకు దూరం

శ్రీకాకుళం జిల్లాలో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. నేటితో నామినేషన్ల గడువు పూర్తవుతుంది. ఆ తర్వాత నామినేషన్లు వేసినవారు ఉపసంహరించుకోవడానికి, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి మద్యం, డబ్బును ఎరగా ఉపయోగించాలని బడా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా తాము ఎంపిక చేసిన వ్యక్తే చివరికి బరిలో నిలుస్తారని కుయుక్తులు పన్నుతున్నారు. ఈ క్రమంలో భారీఎత్తున అక్రమ మద్యం, నాటుసారా జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు ముందస్తుగానే అంచనా వేశాయి. ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి సరిహద్దు మండలాలైన ఇచ్ఛాపురం, మందస, కొత్తూరు, మెళియాపుట్టి, పాతపట్నం, తదితర ప్రాంతాల్లో చెక్‌పోస్టులను మరింత బలోపేతం చేశారు. జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఏమీ లేవని నిర్ధారించుకున్న తర్వాతే వాహనాన్ని వదులుతున్నారు.

పొరుగు రాష్ట్రం నుంచి....

లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయిన కొందరు సులువుగా డబ్బు సంపాదించడానికి మద్యం అక్రమ రవాణాయే పనిగా పెట్టుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా వారు మానడం లేదు. ఇక్కడి మద్యం ధరలు పొరుగు రాష్ట్రంతో పోలిస్తే కొంత ఎక్కువే. అందుకే బరిలో నిలిచే అభ్యర్థులు కూడా పొరుగు రాష్ట్రం నుంచి పెద్దఎత్తున మద్యం అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ మద్యాన్నే ఎరగా చూపి ఓటర్లను తమవైపునకు తిప్పుకోవాలనేదే అభ్యర్థుల లక్ష్యం. సాధారణ రోజుల్లోనే వందల మంది యువకులు, వ్యాపారస్తులు మద్యం అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడేవారు. ఇప్పుడు అలాంటి వారంతా మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వారి కదలికలపైనా నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.

ఆధారాలు చూపకపోతే అదుపులోకే...

పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో దాదాపు జిల్లా అంతటా ఎన్నికల నియమావళి అమలులో ఉంది. పోలీసు వర్గాలు చెక్‌పోస్టుల దగ్గరే కాకుండా ఎక్కడికక్కడ వాహనాలు ఆపి తనిఖీ చేస్తున్నారు. పెద్దమొత్తంలో డబ్బు తరలించే వారినీ ఆరా తీస్తున్నారు. తీసుకెళ్తున్న డబ్బుకు తగిన ఆధారాలు చూపకపోతే వెంటనే ఆ మొత్తాన్ని సీజ్‌ చేసి బాధ్యులను అదుపులోకి తీసుకుంటున్నారు. అత్యవసరాల దృష్ట్యా ఎవరైనా ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్లాల్సి వస్తే అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే చిక్కులు ఎదుర్కోక తప్పదని పోలీసు వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

తలనొప్పిగా సారా తయారీ

జిల్లాలో నాటుసారా తయారీని అరికట్టడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తిస్థాయిలో ఫలితమివ్వట్లేదు. స్థానికంగా దొరికే నాటుసారా ఒకెత్తయితే పొరుగు రాష్ట్రం నుంచి సముద్ర మార్గం ద్వారా వచ్చేది జిల్లా పోలీసులకు మరో పెద్ద తలనొప్పిగా తయారైంది. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు పక్క రాష్ట్రంలో, రాష్ట్ర సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు జాయింట్‌ ఆపరేషన్లు కూడా నిర్వహించారు. కానీ అక్కడ పూర్తిస్థాయిలో నిలువరించడానికి జిల్లా పోలీసులకు అధికారం లేదు. ఫలితంగా పక్క రాష్ట్రం నుంచి సముద్ర మార్గం ద్వారా నాటుసారా రవాణా అధికంగా ఉంటోంది. దీన్ని అరికట్టడానికి పోలీసులు తీర ప్రాంతాల్లోనూ గస్తీ ముమ్మరం చేశారు.


ఇదీ చదవండి : రిజర్వేషన్ల తంట.. ఓట్లకు దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.