విశాఖపట్నంలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు చేసిన ప్రకటనను స్వాగతిస్తూ వైకాపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. వైకాపా ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏడు రోడ్ల కూడలి వద్ద బాణాసంచా కాల్చి... మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్మనోహర్ నాయుడుతో పాటు పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...