ETV Bharat / state

'కేసులు పెరుగుతున్నాయ్​.. అప్రమత్తంగా ఉండండి'

author img

By

Published : Jun 17, 2020, 12:13 AM IST

Updated : Jun 17, 2020, 12:52 AM IST

శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నివాస్ సూచించారు. ఎవరికి వారు స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటివరకూ జిల్లాలో 384 కేసులు నమోదయ్యాయి.

srikakulam district
కరోనా వ్యాప్తి దృష్ట్యా అప్రమత్తంగా ఉండండి

శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్​ నివాస్​ తెలిపారు. అధికారులకు ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు. జిల్లాలో 384 కేసులు నమోదు కాగా.. 271 యాక్టివ్​ కేసులు ఉన్నాయని అన్నారు. శ్రీకాకుళం నగరంలో 10 కేసుల వరకు ఉన్నాయని పేర్కొన్నారు.

తెలంగాణ, ముంబయి, గుజరాత్, దిల్లీ తదితర ప్రాంతాల నుంచి రైలు, విమానం తదితర మార్గాల నుంచి జిల్లాకు అనేక మంది వచ్చారన్నారు. బయట నుంచి వచ్చిన వారు దగ్గర బంధువులైనా, ప్రాణ స్నేహితులైనా కలవవద్దని హితవు పలికారు. రానున్న రోజుల్లో కరోనా‌ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు.

శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్​ నివాస్​ తెలిపారు. అధికారులకు ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు. జిల్లాలో 384 కేసులు నమోదు కాగా.. 271 యాక్టివ్​ కేసులు ఉన్నాయని అన్నారు. శ్రీకాకుళం నగరంలో 10 కేసుల వరకు ఉన్నాయని పేర్కొన్నారు.

తెలంగాణ, ముంబయి, గుజరాత్, దిల్లీ తదితర ప్రాంతాల నుంచి రైలు, విమానం తదితర మార్గాల నుంచి జిల్లాకు అనేక మంది వచ్చారన్నారు. బయట నుంచి వచ్చిన వారు దగ్గర బంధువులైనా, ప్రాణ స్నేహితులైనా కలవవద్దని హితవు పలికారు. రానున్న రోజుల్లో కరోనా‌ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు.

ఇదీ చదవండి..

వ్యవసాయ బడ్జెట్: కేటాయింపులు తగ్గినా...రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం !

Last Updated : Jun 17, 2020, 12:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.