ETV Bharat / state

న్యాయం కోసం.. సచివాలయ ఉద్యోగి కుటుంబీకుల ధర్నా

author img

By

Published : May 9, 2020, 9:17 PM IST

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ఉపకేంద్రం వద్ద సచివాలయ ఉద్యోగి దాలినాయుడి కుటుంబీకులు ధర్నాకు దిగారు. మార్చి 20న విద్యుత్​ కేద్రంలో మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై... చికిత్స పొందుతూ దాలినాయుడు మృతి చెందాడు. ఈ కారణంగా తమను ఆదుకోవాలని స్థానికులతో కలిసి కుటుంబీకులు నిరసన చేపట్టారు.

power employee died in srikakulam their family members doing dharna
సచివాలయ ఉద్యోగి మృతితో ధర్నా....

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి విద్యుత్​ ఉపకేంద్రం వద్ద సచివాలయ ఉద్యోగి దాలి నాయుడు కుటుంబీకులు ధర్నాకు దిగారు. టెక్కలి నుంచి వచ్చే 33 కేవీ లైన్​లో కృష్ణచంద్రాపురం వద్ద... మార్చి 20వ తేదీన మరమ్మతులు చేస్తుండగా సచివాలయ ఉద్యోగులు గోపాల్​, దాలినాయుడు విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిలో గోపాల్​ చికిత్స అనంతరం కోలుకోగా... దాలినాయుడు వెన్నెపూస ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.

సచివాలయ ఉద్యోగం పొందిన నేపథ్యంలో అంతా సంతోషంగా ఉన్న వేళ... విద్యుత్​ ప్రమాదంతో కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబీకులు ఆవేదన చెందారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని గ్రామస్థులతో కలిసి ధర్నా చేశారు.

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి విద్యుత్​ ఉపకేంద్రం వద్ద సచివాలయ ఉద్యోగి దాలి నాయుడు కుటుంబీకులు ధర్నాకు దిగారు. టెక్కలి నుంచి వచ్చే 33 కేవీ లైన్​లో కృష్ణచంద్రాపురం వద్ద... మార్చి 20వ తేదీన మరమ్మతులు చేస్తుండగా సచివాలయ ఉద్యోగులు గోపాల్​, దాలినాయుడు విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిలో గోపాల్​ చికిత్స అనంతరం కోలుకోగా... దాలినాయుడు వెన్నెపూస ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.

సచివాలయ ఉద్యోగం పొందిన నేపథ్యంలో అంతా సంతోషంగా ఉన్న వేళ... విద్యుత్​ ప్రమాదంతో కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబీకులు ఆవేదన చెందారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని గ్రామస్థులతో కలిసి ధర్నా చేశారు.

ఇవీ చదవండి:

లాక్​డౌన్​ను ఉల్లంఘించిన ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.