ETV Bharat / state

శవపరీక్షా కేంద్రం... సమస్యలకు నిలయం

ఆ గది చుట్టూ చెత్తా చెదారం పేరుకు పోయి ఉంటాయి. నీరు నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. రవాణా, విద్యుత్ సరఫరా లేదు. ఈ పరిస్థితికి తోడు చుట్టూ ఆక్రమణలు.. ఇది నరసన్నపేటలోని ఓ శవపరీక్ష కేంద్రం దుస్థితి.

author img

By

Published : May 18, 2019, 4:08 PM IST

అధ్వాన స్థితిలో శవపరీక్షా కేంద్రం
మురికి కూపం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సామాజిక ఆసుపత్రి ఆధ్వర్యంలోని శవ పరీక్ష కేంద్రం దారుణ స్థితిలో ఉంది. ఆసుపత్రికి అర కిలోమీటరు దూరాన ఉన్న ఈ శవపరీక్ష గదికి వెళితే ఎవరైనా ముక్కు మూసుకోక తప్పదు. అది శవాల కారణంగా అనుకుంటే పొరపాటే. గది చుట్టు పక్కల ప్రాంతం మురికి కూపంలా మారడమే ఈ సమస్యకు కారణమైంది. శవపరీక్ష గదికి కనీసం విద్యుత్ సదుపాయం లేదు. ఈ కేంద్రానికి మృతదేహాన్ని తీసుకు రావాలంటే నరక యాతన తప్పదు. గదిలో వైద్యుడు కూర్చొనేందుకు సదుపాయం కూడా లేకపోవడం చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వీటితో పాటు కేంద్రానికి చుట్టూ ఆక్రమణలు పేరుకుపోయాయి. వైద్యవిధాన పరిషత్ ఈ కేంద్రం అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వైద్య సిబ్బంది తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వసతులు లేని ఆ కేంద్రంలో శవ పరీక్షలు చేయాలంటే ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ఆక్రమణలు తొలగించి శవ పరీక్ష కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

మురికి కూపం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సామాజిక ఆసుపత్రి ఆధ్వర్యంలోని శవ పరీక్ష కేంద్రం దారుణ స్థితిలో ఉంది. ఆసుపత్రికి అర కిలోమీటరు దూరాన ఉన్న ఈ శవపరీక్ష గదికి వెళితే ఎవరైనా ముక్కు మూసుకోక తప్పదు. అది శవాల కారణంగా అనుకుంటే పొరపాటే. గది చుట్టు పక్కల ప్రాంతం మురికి కూపంలా మారడమే ఈ సమస్యకు కారణమైంది. శవపరీక్ష గదికి కనీసం విద్యుత్ సదుపాయం లేదు. ఈ కేంద్రానికి మృతదేహాన్ని తీసుకు రావాలంటే నరక యాతన తప్పదు. గదిలో వైద్యుడు కూర్చొనేందుకు సదుపాయం కూడా లేకపోవడం చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వీటితో పాటు కేంద్రానికి చుట్టూ ఆక్రమణలు పేరుకుపోయాయి. వైద్యవిధాన పరిషత్ ఈ కేంద్రం అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వైద్య సిబ్బంది తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వసతులు లేని ఆ కేంద్రంలో శవ పరీక్షలు చేయాలంటే ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ఆక్రమణలు తొలగించి శవ పరీక్ష కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

Lucknow (UP), May 17 (ANI): A portion of a wall decor fell off at Chaudhary Charan Singh International Airport in Uttar Pradesh's Lucknow today. No injuries have been reported. One of the passengers, who escaped unhurt, said, "I was just a few inches away when the decoration".

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.