రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తన సొంత నియోజకవర్గం నరసన్నపేట పరిధిలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పలువురు వైకాపా నేతలు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల వంటి నిర్మాణాల్లో అంచనాలకు మించి ఖర్చు చేయిస్తున్నారని, వాటి బిల్లులు ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని తెలిపారు.
ఏదో ఒక కారణం చెప్పి పనులు చేయకుండా నాన్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశధార కాలువల ద్వారా చివరి భూములకు సాగునీరు అందడం లేదని మరికొందరు మంత్రి వద్ద ఏకరువు పెట్టారు. నియోజకవర్గంలో అధికారుల తీరు మెరుగుపడాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాలని మంత్రి సూచించారు.
ఇదీ చదవండి: