ETV Bharat / state

జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ

author img

By

Published : Oct 10, 2020, 8:46 AM IST

కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు అమ్మ ఒడి, నాడు-నేడు, జగనన్న విద్య కానుక పథ‌కాలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కిరణ్ కుమార్ అన్నారు.

జగనన్న విద్యాకానకు కిట్లను అందిస్తున్న ఎమ్మెల్యే
జగనన్న విద్యాకానకు కిట్లను అందిస్తున్న ఎమ్మెల్యే


శ్రీకాకుళం జిల్లా లావేరు, జి.సిగడం మండలాల్లో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను ఎమ్మెల్యే కిరణ్ కుమార్ పంపిణీ చేశారు. ప్రతి విద్యార్ధికి ఏకరూప దుస్తులు, పుస్తకాలు, బూట్లు, బ్యాగ్‌తో పాటు అవసరమైన అనేక వస్తువులను అందించారు. అనంతరం దివ్యాంగ విద్యార్థులకు ట్రైసైకిళ్లను అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ చక్రవర్తి, ఎంపీడీవో మధుసూదనరావు, ఎంఈఓ ఈశ్వరరావు, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ మాడుగుల రూపావతి, తదితరులు పాల్గొన్నారు.


శ్రీకాకుళం జిల్లా లావేరు, జి.సిగడం మండలాల్లో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను ఎమ్మెల్యే కిరణ్ కుమార్ పంపిణీ చేశారు. ప్రతి విద్యార్ధికి ఏకరూప దుస్తులు, పుస్తకాలు, బూట్లు, బ్యాగ్‌తో పాటు అవసరమైన అనేక వస్తువులను అందించారు. అనంతరం దివ్యాంగ విద్యార్థులకు ట్రైసైకిళ్లను అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ చక్రవర్తి, ఎంపీడీవో మధుసూదనరావు, ఎంఈఓ ఈశ్వరరావు, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ మాడుగుల రూపావతి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

నో మాస్క్​ నో సర్వీస్... అన్​లాక్​ 5 మార్గదర్శకాలు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.