శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం సింగుపురం సమీపంలోని తోటలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడులు చేశారు. ఎస్సై జనార్దన్కు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. 10 మందిని అదుపులోకి తీసుకుని రూ. 62,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఇవీ చదవండి...