ETV Bharat / state

వినూత్నం... విందులో మట్టిపాత్రల వినియోగం

విందుల్లో, శుభకార్యాల్లో ప్లాస్టిక్ గ్లాసుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి వాడి పాడేసే ఈ ఉత్పత్తుల వల్ల అటు ఖర్చుతో పాటు పర్యావరణానికి కలిగే నష్టం ఎక్కవే. అదే మట్టి పాత్రలు వినియోగిస్తే ఖర్చును తగ్గించడమే కాక.. పర్యావరణానికి మేలు చేసినట్లు ఉంటుంది. ఇలాంటి ఆలోచనే చేసింది ఓ గణేష్ ఉత్సవ కమిటీ.

author img

By

Published : Sep 7, 2019, 10:37 PM IST

మట్టిపాత్రలు
అన్నదాన కార్యక్రమంలో మట్టిపాత్రల వినియోగం

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని జిక్కివారి వీధిలోని గణేష్ ఉత్సవ కమిటీ వినూత్నంగా ఆలోచించింది. విందు కార్యక్రమాల్లో భక్తులకు తాగునీటిని మట్టి పాత్రల్లో అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఐదు రోజులుగా ఈ వీధిలో వినాయక మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం అన్నదానం నిర్వహించారు. ఇలాంటి వేడుకల్లో తాగునీటి కోసం ప్లాస్టిక్ గ్లాసులను వినియోగించడం పరిపాటి. అయితే ఇవి పర్యావరణానికి హాని కలిగిస్తాయని కమిటీ సభ్యులు చిన్నపాటి మట్టి పాత్రలను వినియోగించారు. వాటితోనే భక్తులకు తాగునీటిని అందించారు. పర్యావరణ పరిరక్షణ కోసమే మట్టి పాత్రలు ఏర్పాటు చేసినట్టు బాల గణపతి కమిటీ సభ్యులు తెలిపారు.

అన్నదాన కార్యక్రమంలో మట్టిపాత్రల వినియోగం

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని జిక్కివారి వీధిలోని గణేష్ ఉత్సవ కమిటీ వినూత్నంగా ఆలోచించింది. విందు కార్యక్రమాల్లో భక్తులకు తాగునీటిని మట్టి పాత్రల్లో అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఐదు రోజులుగా ఈ వీధిలో వినాయక మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం అన్నదానం నిర్వహించారు. ఇలాంటి వేడుకల్లో తాగునీటి కోసం ప్లాస్టిక్ గ్లాసులను వినియోగించడం పరిపాటి. అయితే ఇవి పర్యావరణానికి హాని కలిగిస్తాయని కమిటీ సభ్యులు చిన్నపాటి మట్టి పాత్రలను వినియోగించారు. వాటితోనే భక్తులకు తాగునీటిని అందించారు. పర్యావరణ పరిరక్షణ కోసమే మట్టి పాత్రలు ఏర్పాటు చేసినట్టు బాల గణపతి కమిటీ సభ్యులు తెలిపారు.

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_46_06_ Special_ Music_ Vinyaka_Yatra_AV_AP10004Body:అనంతపురం జిల్లా కదిరిలో వినాయక నిమజ్జనం శోభాయాత్ర ప్రత్యేక వాయిద్యం ఆకట్టుకుంది. శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడి ప్రతిమను ప్రత్యేక పూజ కోసం రైల్వే స్టేషన్ రోడ్డు వద్దకు తీసుకెళ్లారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రతిమలు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి ఊరేగింపుగా నిమజ్జనానికి తరలి వెళతాయి.ఈ ర్యాలీలో ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విగ్రహం ముందు కేరళ నుంచి వచ్చిన వాయిద్యకారులు తమ సంగీతంతో ఆకట్టుకున్నారుConclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.