ETV Bharat / state

ఇళ్ల స్థలాలకు భూసేకరణపై ఎస్సీ సంఘాల ఆందోళన - srikakulam collecterate

వైఎస్సార్‌ నవశకం పేరుతో తమ భూములు లాక్కోవడంపై శ్రీకాకుళం జిల్లాలో ఎస్సీ సంఘాలు... జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన తెలిపాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

Dalit community agitation in Srikakulam
శ్రీకాకుళంలో దళిత సంఘాల ఆందోళన
author img

By

Published : Feb 3, 2020, 7:08 PM IST

భూ సేకరణపై ఎస్సీ సంఘాల ఆందోళన

వైఎస్సార్‌ నవశకం పేరుతో తమ భూములు తీసుకోవడాన్ని వెంటనే మానుకోవాలని శ్రీకాకుళం జిల్లాలో ఎస్సీ సంఘాల నాయకులు కలెక్టరేట్​ వద్ద ఆందోళనకు దిగారు. ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయడానికి తమ భూములు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. జిల్లాలోని 18 వందల ఎకరాల భూములను అధికారులు సేకరించారని.. అందులో ఎస్సీల భూములతో పాటు ఆదివాసీల భూములు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్​ చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని... లేదంటే.. కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

భూ సేకరణపై ఎస్సీ సంఘాల ఆందోళన

వైఎస్సార్‌ నవశకం పేరుతో తమ భూములు తీసుకోవడాన్ని వెంటనే మానుకోవాలని శ్రీకాకుళం జిల్లాలో ఎస్సీ సంఘాల నాయకులు కలెక్టరేట్​ వద్ద ఆందోళనకు దిగారు. ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయడానికి తమ భూములు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. జిల్లాలోని 18 వందల ఎకరాల భూములను అధికారులు సేకరించారని.. అందులో ఎస్సీల భూములతో పాటు ఆదివాసీల భూములు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్​ చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని... లేదంటే.. కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

చక్కెర కర్మాగారాన్ని పరిశీలించిన త్రిసభ్య కమిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.