ETV Bharat / state

ఉపాధి హామీ పనులపై కలెక్టర్​ సమీక్ష

author img

By

Published : Nov 24, 2020, 8:18 PM IST

శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఉపాధి హామీ పనులపై కలెక్టర్​ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించిన సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

collector review meeting
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గస్థాయిలో జరిగిన ఉపాధి హామీ పనులపై కలెక్టర్ జె. నివాస్​ సమీక్ష నిర్వహించారు. ఆర్బీసీ కేంద్రాలు, వైస్సార్​ హెల్త్​ క్లినిక్​, సచివాలయ భవనాల నిర్మాణాలకు సంబంధించిన సమస్యలను తెలుసుకున్నారు. లక్ష్మీ నర్సంపేట, పాతపట్నం, మెలియాపుట్టి మండలాల్లో ఇసుక అందుబాటులో ఉండటం లేదని నిర్మాణదారులు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన పనులకు బిల్లులు మంజూరు కాలేదని వివరించారు.

​నిర్మాణం పూర్తయిన పనులకు బిల్లులు అందేలా చేస్తామని జిల్లా పాలనాధికారి అన్నారు. సచివాలయ భవనాలకు స్థలాలు సేకరించి..త్వరగా నిర్మాణాలు చేపట్టాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గస్థాయిలో జరిగిన ఉపాధి హామీ పనులపై కలెక్టర్ జె. నివాస్​ సమీక్ష నిర్వహించారు. ఆర్బీసీ కేంద్రాలు, వైస్సార్​ హెల్త్​ క్లినిక్​, సచివాలయ భవనాల నిర్మాణాలకు సంబంధించిన సమస్యలను తెలుసుకున్నారు. లక్ష్మీ నర్సంపేట, పాతపట్నం, మెలియాపుట్టి మండలాల్లో ఇసుక అందుబాటులో ఉండటం లేదని నిర్మాణదారులు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన పనులకు బిల్లులు మంజూరు కాలేదని వివరించారు.

​నిర్మాణం పూర్తయిన పనులకు బిల్లులు అందేలా చేస్తామని జిల్లా పాలనాధికారి అన్నారు. సచివాలయ భవనాలకు స్థలాలు సేకరించి..త్వరగా నిర్మాణాలు చేపట్టాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: సీఎం జగన్ పాలనకు త్వరలో చరమగీతం: ఎంపీ రామ్మోహన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.