శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం అచ్యుతాపురంలోని ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తలుపును గునపంతో విరగ్గొట్టారు. ఇంట్లో ఉన్న బీరువాను పొడిచి తలుపులు తెరిచారు. ఇంట్లో నగదు, బంగారం లేకపోవడంతో వస్తువులను వదిలేసి వెళ్లారు. ఇదే ఇంట్లో ఇరవై రోజుల క్రితం చోరీ జరిగింది. ఆ సమయంలో ఆరు తులాల బంగారం, రూ.15 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఇప్పటికే ఇంట్లో రెండుసార్లు చోరీ జరగడంతో ఇంటి యజమాని పాతపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఊరు చివర ఇల్లు ఉండటంతో తమకు భయంగా ఉందని కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. దొంగలను పట్టుకోవాలని పోలీసులను కోరారు.
ఇది కూడా చదవండి.