FOOD POISION: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పాలనాయుడు పేట గ్రామానికి చెందిన 18 మంది కలుషిత పుట్టగొడుగులు తిని అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోని కొబ్బరితోటలో లభించిన పుట్టగొడుగులను 8 కుటుంబాలకు చెందినవారు రాత్రి భోజనంలో తిన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరికి వాంతులు కావడంతో వారిని టెక్కలిలోని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బాధితులకు సెలైన్లు ఎక్కించడంతో కోలుకుంటున్నారు.
ఇవీ చదవండి: