ETV Bharat / state

రెడ్​జోన్​ను పరిశీలించిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్

లాక్ డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వైకాపా నియోజకవర్గ ఇన్​ఛార్జి కృష్ణచైతన్య నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ సిద్ధార్థ్​ కౌశల్​ ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలోని రెడ్​జోన్​ ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన పోలీస్​ సిబ్బందికి నిత్యావసర సరకులు, శానిటైజర్లు​ పంపిణీ చేశారు.

author img

By

Published : May 6, 2020, 3:52 PM IST

sp siddardh kowsal
రెడ్​జోన్​ను పరిశీలించిన ఎస్పీ సిద్ధార్థ్​ కౌశిల్​


ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం రావినూతల రెడ్ జోన్ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పరిశీలించారు. అక్కడ ఉన్న పరిస్థితులను కోవిడ్-19 ప్రత్యేక అధికారి లక్ష్మీదుర్గను అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వైకాపా నియోజకవర్గ ఇన్​ఛార్జి కృష్ణచైతన్య నిత్యావసర సరకులు, కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రామాన్ని ఎస్పీ ప్రారంభించారు.

కొరిశపాడు, మేదరమెట్ల పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి నిత్యావసర సరకులు, శానిటైజర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి డీఎస్పీ ప్రకాష్ రావు, నియోజకవర్గ కోవిడ్-19 ప్రత్యేక అధికారి లక్ష్మీదుర్గ, నియోజకవర్గ వైకాపా ఇన్​ఛార్జీ చైతన్య, అద్దంకి సీఐ అశోక్ వర్ధన్, తదితరులు పాల్గొన్నారు.


ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం రావినూతల రెడ్ జోన్ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పరిశీలించారు. అక్కడ ఉన్న పరిస్థితులను కోవిడ్-19 ప్రత్యేక అధికారి లక్ష్మీదుర్గను అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వైకాపా నియోజకవర్గ ఇన్​ఛార్జి కృష్ణచైతన్య నిత్యావసర సరకులు, కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రామాన్ని ఎస్పీ ప్రారంభించారు.

కొరిశపాడు, మేదరమెట్ల పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి నిత్యావసర సరకులు, శానిటైజర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి డీఎస్పీ ప్రకాష్ రావు, నియోజకవర్గ కోవిడ్-19 ప్రత్యేక అధికారి లక్ష్మీదుర్గ, నియోజకవర్గ వైకాపా ఇన్​ఛార్జీ చైతన్య, అద్దంకి సీఐ అశోక్ వర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

ఈ నెల 30 నుంచి రైతు భరోసా కేంద్రాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.