ప్రకాశం జిల్లా చీరాలలో లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప వాహనాలను తిరగనీయటం లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో చీరాల ఒకటో పట్టణ ఎస్ఐ సురేశ్ సైకిల్పై తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిని హెచ్చరిస్తున్నారు. చెక్పోస్టుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది వద్దకు వెళ్లి ఉత్సాహపరుస్తున్నారు.
ఇదీ చదవండి