ETV Bharat / state

మార్కాపురంలో రోడ్డు ప్రమాదం..స్థానికుల అప్రమత్తతో తప్పిన ప్రమాదం - prakasham district crime news

మార్కాపురం మండలం దరిమడుగు సమీపంలో ఆటో-కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని కొందరు యువకులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ప్రమాదంలో ధ్వంసమైన కారు
ప్రమాదంలో ధ్వంసమైన కారు
author img

By

Published : Nov 14, 2020, 10:35 PM IST

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దరిమడుగు సమీపంలో ఓ ఆటో-కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడి అందులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన దరిమడుగు గ్రామానికి చెందిన కొందరు యువకులు వెంటనే క్షతగాత్రులను మరో ఆటోలో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీంతో గాయపడిన వారికి వెంటనే చికిత్స అందింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి వైద్యశాలకు తీసుకెళ్లిన యువకులను స్థానికులు, పోలీసులు అభినందించారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దరిమడుగు సమీపంలో ఓ ఆటో-కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడి అందులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన దరిమడుగు గ్రామానికి చెందిన కొందరు యువకులు వెంటనే క్షతగాత్రులను మరో ఆటోలో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీంతో గాయపడిన వారికి వెంటనే చికిత్స అందింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి వైద్యశాలకు తీసుకెళ్లిన యువకులను స్థానికులు, పోలీసులు అభినందించారు.

ఇదీ చదవండి

అనుమానంతో భార్యను చంపిన భర్త..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.