ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని... విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. డీఎస్పీ అశోకవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డులో వాహనాలు తనిఖీలు చేశారు. అనుమతులు లేకుండా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీలో నాలుగు వందలకు పైగా పీడీఎస్ బియ్యం బస్తాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. లారీ డ్రైవర్ను పోలీసులు విచారిస్తున్నారు.
ఇదీ చూడండి. తుంగభద్ర పుష్కరాల్లో పర్యాటక శోభపై దృష్టి పెట్టని ప్రభుత్వం