ETV Bharat / state

అమూల్ చేతిలోకి ఒంగోలు డెయిరీ

author img

By

Published : Dec 30, 2020, 11:42 PM IST

రాష్ట్రానికే తలమానికంగా నిలిచే ఒంగోలు డెయిరీ చరిత్ర ముగియనుంది. పాల సేకరణకు స్వస్తి పలికి , డెయిరీని అమూల్‌ సంస్థకు లీజుకు ఇచ్చేందుకు పాలక వర్గం నిర్ణయం తీసుకుంది. డెయిరీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. సభ్యులుగా ఉన్న పాల ఉత్పత్తి దారుల సహకార సంఘాల అధ్యక్షులు కొంతమంది దీన్ని వ్యతిరేకించినా, పూర్తిగా నష్టాల్లో ఉన్న సంస్థను అప్పగించక తప్పదని, పాడి రైతుల ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందంటూ పాలకమండలి పేర్కొంది.

ongole dairy
అమూల్ చేతిలోకి ఒంగోలు డెయిరీ

ప్రకాశం జిల్లా పాడి ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్, ఒంగోలు డెయిరీ పాలు ఇక మీదట ఉండవు. పాల సేకరణకు ముగింపు పలికారు. గుజరాత్‌ పాల ఉత్పత్తి దారుల సంఘానికి జిల్లాలో పాల సేకరణకు అనుమతులివ్వటం వల్ల ఒంగోలు డెయిరీ పరిస్థితి కొంత ఇరకాటంలో పడింది. తాజాగా వార్షిక సర్వసభ్య సమావేశంలో ఒంగోలు డెయిరీని అమూల్‌ సంస్థకు లీజుకు ఇచ్చేందుకు పాలక వర్గం నిర్ణయం తీసుకుంది. డెయిరీ ఒకప్పుడు లక్షల లీటర్లు పాలు సేకరించేదని, కానీ ఇప్పుడు 10వేల లీటర్ల పాలు కూడా సేకరించే పరిస్థితి లేదని, అప్పులు , నష్టాలు తప్పా డెయిరీ పరిస్థితి ఏమీ బాగలేదని ఏపీ డెయిరీ ఎండీ, ఒంగోలు డెయిరీ ఛైర్మన్‌ అహ్మద్‌ బాబు తెలిపారు. ఇలాగే కొనసాగిస్తే ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని, అందువల్ల నష్టాలతో నడిపే కన్నా మూసివేయడమే మేలని అహ్మద్‌ బాబు పేర్కొన్నారు.

పాడి రైతులకు సరైన ధర లభించడం లేదని, అందువల్ల మహిళా సంఘాలను బలోపేతం చేసి, వారిని 1964 సహకార చట్టం ప్రకారం పాడి సొసైటీలుగా ఏర్పాటు చేసి, వారి ద్వారా పాలు సేకరణ చేపట్టి, అమూల్‌ సంస్థకు సరఫరాచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామంటూ అహ్మద్‌ బాబు ప్రకటించారు. ఈ తీర్మానంతో జిల్లాలో ఉన్న పాడి ఉత్పత్తుల సంఘాలన్నీ మూతపడినట్లే అని భావిస్తున్నారు. నాలుగు శీతలకీరణ కేంద్రాలను అమూల్‌ సంస్థ వినియోగించుకుంటుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా అధికారుల పర్యవేక్షణలో పాలు సేకరణ చేస్తున్నారు. అమూల్‌ సంస్థ రోజుకు దాదాపు 11వేల లీటర్లువరకూ పాలు సేకరిస్తుంది.

సభ్యుల అభ్యంతరాలు :

అధికారుల నిర్ణయంపై పాలకమండలి సభ్యులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కంపెనీ యాక్ట్​ ప్రకారం అధికారులు ఎవరూ డైరక్టర్లుగా ఉండటానికి వీలు లేదని, కానీ ఎండీ.. ఛైర్మన్‌గా, మరికొంతమంది అధికారులు డైరక్టర్లుగా ఉంటూ.. నిర్ణయాలు తీసుకునే అధికారం వీరికి లేదని సభ్యులు పేర్కొన్నారు. 2018-19 సంవత్సరం రూ.12 కోట్లు, 2019-20 సంవత్సరంలో రూ. 20 కోట్లు నష్టం చూపిస్తున్నారు. దాదాపు రూ.వంద కోట్ల అప్పులున్నాయి. సభ్యుల షేర్‌ ధనం రూ.2కోట్ల రూపాయలు ఉంది. వివిధ సందర్భంలో స్థలాలు కొనుగోలు చేశారు. వీటి విలువ దాదాపు రూ.500 కోట్ల వరకూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో డెయిరీ ఆదుకోవలసి ఉంది .. కానీ దీనికి విరుద్దంగా డెయిరీని మూసివేసి, అమూల్‌కు అప్పగించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

రైతులు తమ అభ్యంతరాలు చెపుతున్నా... సభ ముగిసిందన్నట్లు ఛైర్మన్, ఇతర అధికారులు వేదిక నుంచి వెళ్ళిపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లీజుకు ఇస్తూ తీర్మానం చేశామని ఛైర్మన్ అహ్మద్‌ బాబు తెలిపారు. ఒంగోలు డెయిరీ పాల సేకరణలో విఫలమవుతుందని, శీతలీకరణ కేంద్రాలు కూడా వృథాగా ఉన్నాయని , మహిళా సొసైటీల ద్వారా కొనుగోళ్లు చేపట్టడం వల్ల పాడి రైతులకు న్యాయమైన ధర లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఉద్యోగులకు కూడా మంచి ప్యాకేజీ ఇస్తున్నామని ఛైర్మన్ అహ్మద్‌ బాబు తెలిపారు.

అమూల్ చేతిలోకి ఒంగోలు డెయిరీ

ఇదీ చదవండి :

ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయం'

ప్రకాశం జిల్లా పాడి ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్, ఒంగోలు డెయిరీ పాలు ఇక మీదట ఉండవు. పాల సేకరణకు ముగింపు పలికారు. గుజరాత్‌ పాల ఉత్పత్తి దారుల సంఘానికి జిల్లాలో పాల సేకరణకు అనుమతులివ్వటం వల్ల ఒంగోలు డెయిరీ పరిస్థితి కొంత ఇరకాటంలో పడింది. తాజాగా వార్షిక సర్వసభ్య సమావేశంలో ఒంగోలు డెయిరీని అమూల్‌ సంస్థకు లీజుకు ఇచ్చేందుకు పాలక వర్గం నిర్ణయం తీసుకుంది. డెయిరీ ఒకప్పుడు లక్షల లీటర్లు పాలు సేకరించేదని, కానీ ఇప్పుడు 10వేల లీటర్ల పాలు కూడా సేకరించే పరిస్థితి లేదని, అప్పులు , నష్టాలు తప్పా డెయిరీ పరిస్థితి ఏమీ బాగలేదని ఏపీ డెయిరీ ఎండీ, ఒంగోలు డెయిరీ ఛైర్మన్‌ అహ్మద్‌ బాబు తెలిపారు. ఇలాగే కొనసాగిస్తే ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని, అందువల్ల నష్టాలతో నడిపే కన్నా మూసివేయడమే మేలని అహ్మద్‌ బాబు పేర్కొన్నారు.

పాడి రైతులకు సరైన ధర లభించడం లేదని, అందువల్ల మహిళా సంఘాలను బలోపేతం చేసి, వారిని 1964 సహకార చట్టం ప్రకారం పాడి సొసైటీలుగా ఏర్పాటు చేసి, వారి ద్వారా పాలు సేకరణ చేపట్టి, అమూల్‌ సంస్థకు సరఫరాచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామంటూ అహ్మద్‌ బాబు ప్రకటించారు. ఈ తీర్మానంతో జిల్లాలో ఉన్న పాడి ఉత్పత్తుల సంఘాలన్నీ మూతపడినట్లే అని భావిస్తున్నారు. నాలుగు శీతలకీరణ కేంద్రాలను అమూల్‌ సంస్థ వినియోగించుకుంటుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా అధికారుల పర్యవేక్షణలో పాలు సేకరణ చేస్తున్నారు. అమూల్‌ సంస్థ రోజుకు దాదాపు 11వేల లీటర్లువరకూ పాలు సేకరిస్తుంది.

సభ్యుల అభ్యంతరాలు :

అధికారుల నిర్ణయంపై పాలకమండలి సభ్యులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కంపెనీ యాక్ట్​ ప్రకారం అధికారులు ఎవరూ డైరక్టర్లుగా ఉండటానికి వీలు లేదని, కానీ ఎండీ.. ఛైర్మన్‌గా, మరికొంతమంది అధికారులు డైరక్టర్లుగా ఉంటూ.. నిర్ణయాలు తీసుకునే అధికారం వీరికి లేదని సభ్యులు పేర్కొన్నారు. 2018-19 సంవత్సరం రూ.12 కోట్లు, 2019-20 సంవత్సరంలో రూ. 20 కోట్లు నష్టం చూపిస్తున్నారు. దాదాపు రూ.వంద కోట్ల అప్పులున్నాయి. సభ్యుల షేర్‌ ధనం రూ.2కోట్ల రూపాయలు ఉంది. వివిధ సందర్భంలో స్థలాలు కొనుగోలు చేశారు. వీటి విలువ దాదాపు రూ.500 కోట్ల వరకూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో డెయిరీ ఆదుకోవలసి ఉంది .. కానీ దీనికి విరుద్దంగా డెయిరీని మూసివేసి, అమూల్‌కు అప్పగించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

రైతులు తమ అభ్యంతరాలు చెపుతున్నా... సభ ముగిసిందన్నట్లు ఛైర్మన్, ఇతర అధికారులు వేదిక నుంచి వెళ్ళిపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లీజుకు ఇస్తూ తీర్మానం చేశామని ఛైర్మన్ అహ్మద్‌ బాబు తెలిపారు. ఒంగోలు డెయిరీ పాల సేకరణలో విఫలమవుతుందని, శీతలీకరణ కేంద్రాలు కూడా వృథాగా ఉన్నాయని , మహిళా సొసైటీల ద్వారా కొనుగోళ్లు చేపట్టడం వల్ల పాడి రైతులకు న్యాయమైన ధర లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఉద్యోగులకు కూడా మంచి ప్యాకేజీ ఇస్తున్నామని ఛైర్మన్ అహ్మద్‌ బాబు తెలిపారు.

అమూల్ చేతిలోకి ఒంగోలు డెయిరీ

ఇదీ చదవండి :

ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.