ETV Bharat / state

ATTACK ON SUBBARAO : నాకు ప్రాణహాని ఉంది: వైకాపా కార్యకర్త గుప్తా

Attack on subbarao : మంత్రి బాలినేని అనుచరుల దాడికి గురైన సుబ్బారావు గుప్తా మరోసారి వార్తల్లోకి వచ్చారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు తనను పరామర్శించారని.. అయితే తాను ఎప్పటికీ వైకాపా కార్యకర్తనే అని చెప్పుకొచ్చారు.

author img

By

Published : Dec 22, 2021, 4:56 PM IST

సుబ్బారావు
సుబ్బారావు

Attack on subbarao : తనకు ప్రాణహాని ఉందని, నలుగురు హోంగార్డ్​లతో రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు వైకాపా కార్యకర్త సుబ్బారావు గుప్తా. ఈ మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీని కోరారు. ఇక, తనకు వస్తున్న పరామర్శలపైనా స్పందించారు. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు తనకు ఫోన్ చేసి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారని చెప్పారు. అయితే.. వారు ఫోన్ చేసినంత మాత్రానా తాను ఆ పార్టీకి చెందిన వాడిని కాదని అన్నారు.

ఏం జరిగిందంటే..
Attack on subbarao : ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై.. అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం కలిగించింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా సంబంధిత వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 12న బాలినేని పుట్టినరోజు వేడుకల్లో సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌లపై చేసిన వ్యాఖ్యలతో ఆయనకు బెదిరింపులు అధికమయ్యాయి. ఒంగోలు లంబాడీడొంకలోని ఆయన నివాసంపై శనివారం రాత్రి కొందరు యువకులు దాడి చేశారు. దీంతో.. సుబ్బారావు గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

సుబ్బారావుపై దాడి..
గుంటూరులోని బస్టాండు సమీపంలోని ఓ లాడ్జిలో సుబ్బారావు గుప్తా తలదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలినేని అనుచరులు కొందరు ఆదివారం సాయంత్రం 3.40గంటల సమయంలో ఒక పోలీసు వాహనంతోపాటు మరో ప్రైవేటు వాహనంలో ఆ లాడ్జి వద్దకు చేరుకున్నారు. సుభానీ అనే వ్యక్తి సుబ్బారావు గుప్తాపై దాడికి దిగారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పదే పదే దాడి చేశారు. తాను మధుమేహంతో బాధపడుతున్నాననీ, తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. తనను వదిలిపెట్టాలని గుప్తా వేడుకున్నా వినిపించుకోకుండా దాడి చేశారు.

Attack on subbarao : అన్నా మీ కాళ్లు పట్టుకుంటా.. నేను చిన్నప్పటి నుంచి ఆయనకు సేవ చేశా.. పార్టీలో ఏం జరుగుతుందో చెప్పా.. నీకు దండం పెడతా.. చెప్పేది విను..’ అని కాళ్లావేళ్లా పడినా సుభానీ వినిపించుకోలేదు. తీవ్ర స్వరంతో దుర్భాషలాడుతూ గుప్తాను కొట్టారు. ‘చంపేస్తా.. ఎవరు చెబితే నువ్వు మాట్లాడావ్‌, రెండు నిమిషాల్లో నిన్ను ఏసేస్తాం’ అంటూ తీవ్రస్వరంతో బెదిరించారు. సుభానీతోపాటు మరో వ్యక్తి గుప్తాను చొక్కా పట్టుకుని మంచం మీద నుంచి కిందకు లాక్కొచ్చి మోకాళ్లమీద కూర్చోబెట్టి దండం పెట్టిస్తూ.. మంత్రి బాలినేనికి క్షమాపణ చెప్పించారు. మొత్తం ఈ ఉదంతాన్ని చిత్రీకరించారు. ఈ వీడియో సోమవారం బయటకు రావడంతో తీవ్ర కలకలం రేపింది.

మతిస్థిమితం లేదనడం సరికాదు..
Attack on subbarao : సుబ్బారావు గుప్తా విలేకర్లతో మాట్లాడారు. ఒంగోలులో తన నివాసంపై జరిగిన దాడితో ఆందోళనకు గురై గుంటూరులోని పద్మశ్రీ లాడ్జిలో తలదాచుకున్నానన్నారు. ఒక పోలీసు వాహనంతోపాటు మరో వాహనంలో వచ్చిన సుభానీ, అతని బృందం దాడి చేశారన్నారు. తనకు మతిస్థిమితం లేదని భార్య చెప్పినట్లు.. మంత్రి బాలినేని అంటున్నారని, అది సరికాదన్నారు. తానెప్పుడూ పార్టీకి విధేయుడినేనని చెప్పారు.

అనుబంధ కథనాలు..

Attack on subbarao : తనకు ప్రాణహాని ఉందని, నలుగురు హోంగార్డ్​లతో రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు వైకాపా కార్యకర్త సుబ్బారావు గుప్తా. ఈ మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీని కోరారు. ఇక, తనకు వస్తున్న పరామర్శలపైనా స్పందించారు. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు తనకు ఫోన్ చేసి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారని చెప్పారు. అయితే.. వారు ఫోన్ చేసినంత మాత్రానా తాను ఆ పార్టీకి చెందిన వాడిని కాదని అన్నారు.

ఏం జరిగిందంటే..
Attack on subbarao : ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై.. అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం కలిగించింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా సంబంధిత వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 12న బాలినేని పుట్టినరోజు వేడుకల్లో సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌లపై చేసిన వ్యాఖ్యలతో ఆయనకు బెదిరింపులు అధికమయ్యాయి. ఒంగోలు లంబాడీడొంకలోని ఆయన నివాసంపై శనివారం రాత్రి కొందరు యువకులు దాడి చేశారు. దీంతో.. సుబ్బారావు గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

సుబ్బారావుపై దాడి..
గుంటూరులోని బస్టాండు సమీపంలోని ఓ లాడ్జిలో సుబ్బారావు గుప్తా తలదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలినేని అనుచరులు కొందరు ఆదివారం సాయంత్రం 3.40గంటల సమయంలో ఒక పోలీసు వాహనంతోపాటు మరో ప్రైవేటు వాహనంలో ఆ లాడ్జి వద్దకు చేరుకున్నారు. సుభానీ అనే వ్యక్తి సుబ్బారావు గుప్తాపై దాడికి దిగారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పదే పదే దాడి చేశారు. తాను మధుమేహంతో బాధపడుతున్నాననీ, తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. తనను వదిలిపెట్టాలని గుప్తా వేడుకున్నా వినిపించుకోకుండా దాడి చేశారు.

Attack on subbarao : అన్నా మీ కాళ్లు పట్టుకుంటా.. నేను చిన్నప్పటి నుంచి ఆయనకు సేవ చేశా.. పార్టీలో ఏం జరుగుతుందో చెప్పా.. నీకు దండం పెడతా.. చెప్పేది విను..’ అని కాళ్లావేళ్లా పడినా సుభానీ వినిపించుకోలేదు. తీవ్ర స్వరంతో దుర్భాషలాడుతూ గుప్తాను కొట్టారు. ‘చంపేస్తా.. ఎవరు చెబితే నువ్వు మాట్లాడావ్‌, రెండు నిమిషాల్లో నిన్ను ఏసేస్తాం’ అంటూ తీవ్రస్వరంతో బెదిరించారు. సుభానీతోపాటు మరో వ్యక్తి గుప్తాను చొక్కా పట్టుకుని మంచం మీద నుంచి కిందకు లాక్కొచ్చి మోకాళ్లమీద కూర్చోబెట్టి దండం పెట్టిస్తూ.. మంత్రి బాలినేనికి క్షమాపణ చెప్పించారు. మొత్తం ఈ ఉదంతాన్ని చిత్రీకరించారు. ఈ వీడియో సోమవారం బయటకు రావడంతో తీవ్ర కలకలం రేపింది.

మతిస్థిమితం లేదనడం సరికాదు..
Attack on subbarao : సుబ్బారావు గుప్తా విలేకర్లతో మాట్లాడారు. ఒంగోలులో తన నివాసంపై జరిగిన దాడితో ఆందోళనకు గురై గుంటూరులోని పద్మశ్రీ లాడ్జిలో తలదాచుకున్నానన్నారు. ఒక పోలీసు వాహనంతోపాటు మరో వాహనంలో వచ్చిన సుభానీ, అతని బృందం దాడి చేశారన్నారు. తనకు మతిస్థిమితం లేదని భార్య చెప్పినట్లు.. మంత్రి బాలినేని అంటున్నారని, అది సరికాదన్నారు. తానెప్పుడూ పార్టీకి విధేయుడినేనని చెప్పారు.

అనుబంధ కథనాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.