ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - మద్దిపాడులో రోడ్డు ప్రమాదం వార్తలు

ఏడుగుండ్లపాడు నేషనల్​ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని...ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో జరిగింది.

ACCIDENT
ACCIDENT
author img

By

Published : Dec 2, 2020, 10:31 AM IST

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు నేషనల్​ జాతీయ రహదారి ఐషర్ షోరూం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన చినిగే వెంకటేశ్వర్లు ప్రైవేట్ గౌడౌన్​లో వాచ్​మెన్​గా పని చేస్తున్నాడు. రాత్రి పనికి వెళ్లే సమయంలో ఒగోలు నుంచి మద్దిపాడు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొనటంతో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఎస్​ఐ ఫిరోజ్ ఫాతిమా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు నేషనల్​ జాతీయ రహదారి ఐషర్ షోరూం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన చినిగే వెంకటేశ్వర్లు ప్రైవేట్ గౌడౌన్​లో వాచ్​మెన్​గా పని చేస్తున్నాడు. రాత్రి పనికి వెళ్లే సమయంలో ఒగోలు నుంచి మద్దిపాడు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొనటంతో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఎస్​ఐ ఫిరోజ్ ఫాతిమా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

తెలంగాణ: దీక్షిత్​రెడ్డి హత్యకేసు నిందితుడు ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.