ETV Bharat / state

కనిగిరి ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన ఈడీ

కనిగిరి ఆర్టీసీ డిపో, గ్యారేజిని నెల్లూరు ఆర్టీసీ రిజినల్ ఈడీ గోపీనాథ్​రెడ్డి తనిఖీ చేశారు. గత 5 నెలలుగా బస్సులు పూర్తిగా తిరగనందున బస్సుల కండిషన్, సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు.

author img

By

Published : Nov 21, 2020, 6:05 PM IST

కనిగిరి ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన ఈడీ
కనిగిరి ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన ఈడీ

ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్టీసీ డిపో, గ్యారేజీని నెల్లూరు ఆర్టీసీ రీజినల్ ఈడీ గోపీనాథ్ రెడ్డి తనిఖీ చేశారు. బస్సుల కండిషన్, సిబ్బంది పనితీరును పరిశీలించారు. కరోనా సమయంలో సుమారు 5 నెలలపాటు బస్సులు నిలిచిపోయినందున వాటి మరమ్మతులకు అవసరమైన పరికరాలను సమకూర్చనట్లు ఆయన తెలిపారు.

టైర్ల గురించి తీసుకోవల్సిన జాగ్రత్తలు, ఖర్చులు తగ్గించుకునే విధంగా రాష్ట్రంలోని అన్ని డిపోలలో 15 రోజులపాటు ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. కరోనా సమయంలో కూడా కనిగిరి ఆర్టీసీ సిబ్బంది తమ డిపో అభివృధ్దికి చాలా కృషి చేస్తున్నారని గోపినాథ్ వెల్లడించారు.

ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్టీసీ డిపో, గ్యారేజీని నెల్లూరు ఆర్టీసీ రీజినల్ ఈడీ గోపీనాథ్ రెడ్డి తనిఖీ చేశారు. బస్సుల కండిషన్, సిబ్బంది పనితీరును పరిశీలించారు. కరోనా సమయంలో సుమారు 5 నెలలపాటు బస్సులు నిలిచిపోయినందున వాటి మరమ్మతులకు అవసరమైన పరికరాలను సమకూర్చనట్లు ఆయన తెలిపారు.

టైర్ల గురించి తీసుకోవల్సిన జాగ్రత్తలు, ఖర్చులు తగ్గించుకునే విధంగా రాష్ట్రంలోని అన్ని డిపోలలో 15 రోజులపాటు ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. కరోనా సమయంలో కూడా కనిగిరి ఆర్టీసీ సిబ్బంది తమ డిపో అభివృధ్దికి చాలా కృషి చేస్తున్నారని గోపినాథ్ వెల్లడించారు.

ఇదీ చదవండి

నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ అధికారుల దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.