బంగారం షాపులో పట్టపగలే చోరీ.. బంగారు ఆభరణాలు తస్కరణ
ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలో పట్టపగలే చోరీ జరిగింది. ఒక బంగారు దుకాణంలో 15 సవర్ల బంగారు ఆభరణాలను దొంగిలించారు. దుకాణం యాజమాని సతీష్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.