ETV Bharat / state

చిన్నారి నడయాడాల్సిన ఇంట.. విషాదం మిగిల్చిన చున్నీ

పెళ్లై ఏడాది.. ఏడో నెల గర్భం.. ఇది రెండు మాటలు చాలు కదా ఆ కుటుంబంలో అనందోత్సాహాలు ఎంతగా ఉన్నాయో చెప్పడానికి. అందుకే ఆ దేవుడికి కన్ను కుట్టిందేమో.. కొన్ని రోజుల్లో చిన్నారి నడయాడాల్సిన ఇంటిని విషాదంతో నింపేశాడు. చున్నీ రూపంలో వచ్చిన మృత్యువు వారి జీవితాల్లో చీకటి మిగిల్చింది.

author img

By

Published : Jul 24, 2020, 9:31 PM IST

Chunni gets stuck in a two wheeler and dies pregnant
ద్విచక్ర వాహనంలో చున్నీ ఇరుక్కొని గర్భిణి మృతి

ఇంకొన్ని రోజుల్లో చిన్నారిని ఎత్తుకోబోతున్నానన్న అనందంలో ఏడు నెలల గర్భిణి వైద్య పరీక్షలకు బయలుదేరింది. ద్విచక్ర వాహనంపై భర్తతో కలిసి డాక్టర్​ చెకప్​కు బయల్దేరింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని పేర్నమిట్ట వద్దకు చేరుకోగానే ఆమె చున్నీ ద్విచక్ర వాహనంలో ఇరుక్కుపోయి ఒక్కసారిగా రోడ్డుపై పడి మృత్యువాతపడింది.

ప్రకాశం జిల్లా తిమ్మ సముద్రానికి చెందిన సుమ (22) సంతనూతలపాడుకు చెందిన మోషేతో ఏడాది క్రితం వివాహమైంది. వివాహం జరిగిన ఏడాదిలోపే గర్భం దాల్చటంతో కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగితేలారు. ప్రస్తుతం ఏడో నెల కావడంతో వైద్య పరీక్షల కోసం ఒంగోలుకు భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. ఇంకొ పది నిమిషాల్లో ఒంగోలు చేరుకుంటామనే సమయంలో.. మెడలో చున్నీ ద్విచక్ర వాహనంలో ఇరుక్కుపోయి ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో ఆమె తలకు తీవ్ర గాయాలు కావడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఒంగోలులో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా...అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

కుటుంబంలోకి చిన్నారి వస్తుందన్న సంతోషంలో ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చూడండి...

'మీ డబ్బు ఎవడికి కావాలి.... న్యాయం చేయండి చాలు'

ఇంకొన్ని రోజుల్లో చిన్నారిని ఎత్తుకోబోతున్నానన్న అనందంలో ఏడు నెలల గర్భిణి వైద్య పరీక్షలకు బయలుదేరింది. ద్విచక్ర వాహనంపై భర్తతో కలిసి డాక్టర్​ చెకప్​కు బయల్దేరింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని పేర్నమిట్ట వద్దకు చేరుకోగానే ఆమె చున్నీ ద్విచక్ర వాహనంలో ఇరుక్కుపోయి ఒక్కసారిగా రోడ్డుపై పడి మృత్యువాతపడింది.

ప్రకాశం జిల్లా తిమ్మ సముద్రానికి చెందిన సుమ (22) సంతనూతలపాడుకు చెందిన మోషేతో ఏడాది క్రితం వివాహమైంది. వివాహం జరిగిన ఏడాదిలోపే గర్భం దాల్చటంతో కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగితేలారు. ప్రస్తుతం ఏడో నెల కావడంతో వైద్య పరీక్షల కోసం ఒంగోలుకు భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. ఇంకొ పది నిమిషాల్లో ఒంగోలు చేరుకుంటామనే సమయంలో.. మెడలో చున్నీ ద్విచక్ర వాహనంలో ఇరుక్కుపోయి ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో ఆమె తలకు తీవ్ర గాయాలు కావడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఒంగోలులో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా...అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

కుటుంబంలోకి చిన్నారి వస్తుందన్న సంతోషంలో ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చూడండి...

'మీ డబ్బు ఎవడికి కావాలి.... న్యాయం చేయండి చాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.