ETV Bharat / state

గ్యాస్​ డీలర్​షిప్​ ఇప్పిస్తామని ఆన్​లైన్​ మోసం.. నిందితుల అరెస్టు

author img

By

Published : Mar 10, 2020, 10:19 PM IST

ఆన్​లైన్ మోసాలకు పాల్పడుతోన్న పశ్చిమబంగాకు చెందిన ఇద్దరు నిందితులను ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు గ్యాస్​డీలర్​ షిప్​ ఇప్పిస్తామని చెప్పి బాధితుడి దగ్గర నుంచి పలు దఫాలుగా రూ.8 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

chirala police arrested two persons who did cyber crime
ఆన్​మోసాలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన పోలీసులు
ఆన్​లైన్​ మోసాలకు పాల్పడుతోన్న ఇద్దరు నిందితుల అరెస్టు

నకిలీ వెబ్​సైట్​ సృష్టించి ఓ వ్యక్తికి గ్యాస్​ డీలర్​ షిప్​ ఇప్పిస్తామని చెప్పి మోసగించిన ఇద్దరు పశ్చిమబంగా యువకులను ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు కటాకటాల్లోకి నెట్టారు. పశ్చిమబంగాకు చెంది టన్సన్ నాయక్, మానిక్ పట్నాయక్​లు చీరాల మండలం పాతచీరాలకు చెందిన సమ్మెట స్వామినాథ్​​​కు గ్యాస్ డిలర్​ షిప్ ఇప్పిస్తామని నమ్మబలికారు. ఇందుకోసం నిందితులు ఒక నకిలీ వెబ్​సైట్​ రూపొందించారు. వీరిని నమ్మిన స్వామినాథ్​​ దరఖాస్తు నిమిత్తం మొదటిగా రూ.22 వేలు ఆన్​లైన్ ద్వారా ఖాతాలో వేశారు. అప్పటి నుంచి పలు దఫాలుగా సుమారు రూ.8 లక్షలు స్వామినాథ్​ నుంచి నిందితులు వసూలు చేశారు. అప్పటి నుంచి ఫోన్​ చేసినా సమాధానం రాకపోయేసరికి మోసపోయానని గ్రహించిన బాధితుడు జనవరిలో చీరాల ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక పరిజ్జానంతో కేసును ఛేదించిన పోలీసులు నిందితులను కోల్​కతాలో అరెస్టు చేసి చీరాలకు తీసుకొచ్చారు. వీరిని కోర్టులో హాజరు పరచనున్నట్లు చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి తెలిపారు.

ఆన్​లైన్​ మోసాలకు పాల్పడుతోన్న ఇద్దరు నిందితుల అరెస్టు

నకిలీ వెబ్​సైట్​ సృష్టించి ఓ వ్యక్తికి గ్యాస్​ డీలర్​ షిప్​ ఇప్పిస్తామని చెప్పి మోసగించిన ఇద్దరు పశ్చిమబంగా యువకులను ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు కటాకటాల్లోకి నెట్టారు. పశ్చిమబంగాకు చెంది టన్సన్ నాయక్, మానిక్ పట్నాయక్​లు చీరాల మండలం పాతచీరాలకు చెందిన సమ్మెట స్వామినాథ్​​​కు గ్యాస్ డిలర్​ షిప్ ఇప్పిస్తామని నమ్మబలికారు. ఇందుకోసం నిందితులు ఒక నకిలీ వెబ్​సైట్​ రూపొందించారు. వీరిని నమ్మిన స్వామినాథ్​​ దరఖాస్తు నిమిత్తం మొదటిగా రూ.22 వేలు ఆన్​లైన్ ద్వారా ఖాతాలో వేశారు. అప్పటి నుంచి పలు దఫాలుగా సుమారు రూ.8 లక్షలు స్వామినాథ్​ నుంచి నిందితులు వసూలు చేశారు. అప్పటి నుంచి ఫోన్​ చేసినా సమాధానం రాకపోయేసరికి మోసపోయానని గ్రహించిన బాధితుడు జనవరిలో చీరాల ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక పరిజ్జానంతో కేసును ఛేదించిన పోలీసులు నిందితులను కోల్​కతాలో అరెస్టు చేసి చీరాలకు తీసుకొచ్చారు. వీరిని కోర్టులో హాజరు పరచనున్నట్లు చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:

చీరాల రహదారిపై రోడ్డు ప్రమాదం, ముగ్గురికి తీవ్రగాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.