ప్రకాశం జిల్లా చీరాలలో దిలీప్ అనే వ్యక్తి హత్యకేసులో భార్యతో సహా కుటుంబ సభ్యులను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో 14 సంవత్సరాల బాలుడు ఉన్నట్లు చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి తెలిపారు. పథకం ప్రకారమే నిందితులు హత్య చేసినట్లు పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా చీరాల మండలం సాయికాలనీలో దిలీప్, రెబకా దంపతులు జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు సంతానం.. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు వేరుగా ఉంటున్నారు. లాక్డౌన్ కారణంగా పెద్దల సమక్షంలో ఇద్దరూ మాట్లాడుకుని లాక్డౌన్ అనంతరం కోర్టు ద్వారా విడాకులు తీసుకుందామని అనుకున్నారు. అయితే ఈ విషయంపై మాటామాటా పెరిగి గొడవపడ్డారు. ఈ క్రమంలో భర్తను హత్య చేయాలని భావించిన భార్య రెబకా కుటుంబ సభ్యులు దిలీప్ను పిలిపించి మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న దిలీప్పై కత్తితో దాడి చేసి చంపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు భార్య రెబక్, అత్త, మామ, బావమరిదితో సహా ఏడుగురిని అరెస్టు చేశారు.
ఇదీ చూడండి..