ETV Bharat / state

1,920 మద్యం సీసాలు పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం పట్టుబడింది. ఇద్దరు అరస్టయ్యారు. పట్టుబడిన 1,920 బాటిళ్ల మద్యం తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ నుంచి అక్రమంగా తరలించినట్లు అధికారులు గుర్తించారు.

author img

By

Published : Dec 19, 2020, 4:20 PM IST

alcohol seized and two persons arrested
మద్యం పట్టివేత

తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం వద్ద ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1,920 మద్యం సీసాలు, టెంపో వాహనం స్వాధీనం చేసుకున్నారు. బొలెరో వాహనంలో నిమ్మకాయ బస్తాలు లోడ్ చేసి, వాటి కింద సీసాలు ఉంచారు. ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన అధికారులు చాకచక్యంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం వద్ద ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1,920 మద్యం సీసాలు, టెంపో వాహనం స్వాధీనం చేసుకున్నారు. బొలెరో వాహనంలో నిమ్మకాయ బస్తాలు లోడ్ చేసి, వాటి కింద సీసాలు ఉంచారు. ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన అధికారులు చాకచక్యంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఒంగోలుకు తందూరి ఛాయ్​ రుచి చూపించాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.