ప్రకాశం జిల్లా అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైద్యులకు పీపీఈ కిట్లు అందజేశారు. అలాగే అక్కడి సిబ్బందికి 600 మాస్కులు పంపిణీ చేశారు. కరోనా నివారణకు నిరంతరం శ్రమిస్తోన్న వైద్యులు, వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. వారి సేవలు మరువలేనివని కొనియాడారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్పై ఇచ్చిన సడలింపులను అనువుగా చేసుకొని ప్రజలు బయటకు రాకూడదని కొవిడ్ ప్రత్యేక అధికారి లక్ష్మీదుర్గ కోరారు.
ఇదీ చూడండి..