ETV Bharat / state

అద్దంకిలో వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

author img

By

Published : Apr 20, 2020, 2:51 PM IST

కరోనా నివారణకు నిరంతరం కృషి చేస్తోన్న వైద్య సిబ్బంది సేవలు మరువలేనివని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్​ కొనియాడారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులకు పీపీఈ కిట్లు, సిబ్బందికి మాస్కులు పంపిణీ చేశారు.

అద్దంకిలో వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
అద్దంకిలో వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్​ వైద్యులకు పీపీఈ కిట్లు అందజేశారు. అలాగే అక్కడి సిబ్బందికి 600 మాస్కులు పంపిణీ చేశారు. కరోనా నివారణకు నిరంతరం శ్రమిస్తోన్న వైద్యులు, వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. వారి సేవలు మరువలేనివని కొనియాడారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్​పై ఇచ్చిన సడలింపులను అనువుగా చేసుకొని ప్రజలు బయటకు రాకూడదని కొవిడ్​ ప్రత్యేక అధికారి లక్ష్మీదుర్గ కోరారు.

ఇదీ చూడండి..

ప్రకాశం జిల్లా అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్​ వైద్యులకు పీపీఈ కిట్లు అందజేశారు. అలాగే అక్కడి సిబ్బందికి 600 మాస్కులు పంపిణీ చేశారు. కరోనా నివారణకు నిరంతరం శ్రమిస్తోన్న వైద్యులు, వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. వారి సేవలు మరువలేనివని కొనియాడారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్​పై ఇచ్చిన సడలింపులను అనువుగా చేసుకొని ప్రజలు బయటకు రాకూడదని కొవిడ్​ ప్రత్యేక అధికారి లక్ష్మీదుర్గ కోరారు.

ఇదీ చూడండి..

'కరోనా నియంత్రణకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోంది'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.