ETV Bharat / state

విద్యుదాఘాతంతో యువకుడి మృతి - ప్రకాశం జిల్లాలో విద్యుత్ సమస్య

పొలంలో మోటార్​ ఏర్పాటు చేసేందుకు వైర్లు సరి చేస్తుండగా విద్యుత్​ సరఫరా జరిగి ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

a-man-dead
a-man-dead
author img

By

Published : Aug 6, 2020, 10:35 AM IST

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలో.. విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. కొత్తూరు పంచాయతీ శివారు అరుణగిరి తండాకు చెందిన మేడావత్ సురేష్ నాయక్ తన పొలంలో మోటారు బిగించేందుకు విద్యుత్తు వైర్లు సరి చేస్తున్నాడు. ఆ వైర్లకు విద్యుత్తు సరఫరా కావడంతో షాక్​నకు గురై సురేష్ నాయక్ మృతి చెందాడు. మృతుని తండ్రి హర్యానానాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ఆసుపత్రికి తరలించారు.

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలో.. విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. కొత్తూరు పంచాయతీ శివారు అరుణగిరి తండాకు చెందిన మేడావత్ సురేష్ నాయక్ తన పొలంలో మోటారు బిగించేందుకు విద్యుత్తు వైర్లు సరి చేస్తున్నాడు. ఆ వైర్లకు విద్యుత్తు సరఫరా కావడంతో షాక్​నకు గురై సురేష్ నాయక్ మృతి చెందాడు. మృతుని తండ్రి హర్యానానాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: కొవిడ్​ పంజా: 40 వేలు దాటిన మృతుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.