ETV Bharat / state

విద్యుత్ ఛార్జీల పెంపుపై తెదేపా నేత నిరసన.. అరెస్ట్

author img

By

Published : May 19, 2020, 12:49 PM IST

విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా నెల్లూరులో దీక్ష చేస్తున్న తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వమే.. వారిపై అధిక ఛార్జీలు మోపి ఇబ్బందులు పెడుతోందని కోటంరెడ్డి విమర్శించారు.

tdp leader kotamreddy srinivasulu protest against high current bills nellore
తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులు అరెస్ట్

రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నెల్లూరులో తేదేపా నేతలు నిరసన చేపట్టారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర తేదేపా నేత, నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మౌన దీక్ష చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లుల కేటగిరీల శ్లాబులు మార్చి, పేదలపై భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు.

లాక్ డౌన్ సమయంలో పెరిగిన బిల్లులు కట్టలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నవరత్నాల పథకాల అమలు కోసమే విద్యుత్ బిల్లుల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు.

రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నెల్లూరులో తేదేపా నేతలు నిరసన చేపట్టారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర తేదేపా నేత, నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మౌన దీక్ష చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లుల కేటగిరీల శ్లాబులు మార్చి, పేదలపై భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు.

లాక్ డౌన్ సమయంలో పెరిగిన బిల్లులు కట్టలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నవరత్నాల పథకాల అమలు కోసమే విద్యుత్ బిల్లుల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. కోటంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు.

ఇవీ చదవండి:

నెల్లూరు జిల్లాలో గాలివాన బీభత్సం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.