గూడూరు తెదేపా మాజీ ఎమ్మల్యే సునీల్ కుమార్.. వైకాపా ఏడాది పాలనపై మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం విధ్వంస పాలన చేస్తోందని ఆరోపించారు. గూడూరు మున్సిపాలిటీలో గత ప్రభుత్వం 5వేల102 ఎన్టీఆర్ గృహాలను పేదలకు నిర్మించిందని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో వైకాపా ఉచితంగా పేదలకు ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి రాగానే మూడు విడతలుగా డబ్బులను వాయిదా పద్ధతిలో కట్టాలని నోటీసులు పంపడం సరికాదన్నారు. ఈ విషయంపై మున్సిపాలిటీ అధికారులు, జిల్లా కలెక్టర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
ఇదీ చదవండి: