పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పడుగుపాడు గ్రామంలో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. దాత విజయకుమార్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు నూతన వస్త్రాలు, నిత్యావసర వస్తువులు అందజేశారు. దాదాపు రెండు వందల మంది ముస్లింలకు ఈ తోఫాను అందజేశారు. కులమతాలకు అతీతంగా ముఖ్య పండుగల సమయంలో విజయకుమార్ నిత్యావసరాలు పంపిణీ చేస్తూ, పేదలకు చేయూతనందిస్తున్నారని ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు ఆయన్ను కొనియాడారు.
ఇదీ చదవండి : ముస్లింలకు సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు