విద్యుదాఘాతంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం జయపురం గ్రామంలో తెల్లవారుజామున ఓ యువకుడు మృతి చెందాడు. జయపురం గ్రామంలో మామిడి రైతు... తోటల్లోకి అడవి పందులు ప్రవేశించకుండా చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేశాడు. నెమల్లదిన్నె గ్రామానికి చెందిన రాగి వీరాంజనేయులు ఆ విద్యుత్ కంచెను గమనించక తోటలోకి ప్రవేశించబోయాడు. విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఉదయగిరి సీఐ సత్యనారాయణృ స్థానికులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టాడు.
ఇదీ చదవండి :