ETV Bharat / state

'రెండు రోజుల్లో జిల్లాలో కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది'

author img

By

Published : Aug 14, 2020, 6:06 PM IST

నెల్లూరు నగరంలో మంత్రి అనిల్ కుమార్ పర్యటించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని ప్రజలకు సహకరించాలని మంత్రి పేర్కొన్నారు. కొవిడ్ ఆసుపత్రిని పరిశీలించి మంత్రి రానున్న రెండు రోజుల్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నందున పడకలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.

minister-anil-kumar-visits-nellore-dst-about-corona
minister-anil-kumar-visits-nellore-dst-about-corona

కరోనా నియంత్రణకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరు నగరం 51వ డివిజన్​లో మంత్రి పర్యటించారు. రోజు జిల్లాలో ఆరు వేలకు పైగా కరోనా పరీక్షలు చేస్తుండటంతో 6 నుంచి 8 శాతం పాజిటివ్ కేసులు వస్తున్నాయని తెలిపారు.

నగరంలోని నారాయణ కొవిడ్ హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో కలిసి మంత్రి సందర్శించారు. హాస్పిటల్స్ లోనూ అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు అందరూ సహకరిస్తే కరోనాను నివారించవచ్చాన్నారు. రానున్న రెండు నెలల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున అవసరమైన పడకలను సిద్ధం చేయాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

హాస్పిటల్ లో అందిస్తున్న చికిత్స, సదుపాయాలపై నారాయణ ఆస్పత్రి వైద్యులతో మంత్రి సమీక్షించారు. ఆస్పత్రిలో ఉన్న1000 కొవిడ్ పడకలతోపాటూ, అదనపు బెడ్స్ సిద్ధం చేయాలని సూచించారు. బాధితులకు ఇచ్చే ఆహారం నాణ్యతగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఐసీయూ బెడ్స్ సంఖ్యను పెంచాలన్నారు. కరోనా వ్యాధి లక్షణాలతో ఎవరు వచ్చినా వారిని వెనక్కి పంపకుండా చికిత్స అందించాలన్నారు.

కరోనా నియంత్రణకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరు నగరం 51వ డివిజన్​లో మంత్రి పర్యటించారు. రోజు జిల్లాలో ఆరు వేలకు పైగా కరోనా పరీక్షలు చేస్తుండటంతో 6 నుంచి 8 శాతం పాజిటివ్ కేసులు వస్తున్నాయని తెలిపారు.

నగరంలోని నారాయణ కొవిడ్ హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో కలిసి మంత్రి సందర్శించారు. హాస్పిటల్స్ లోనూ అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు అందరూ సహకరిస్తే కరోనాను నివారించవచ్చాన్నారు. రానున్న రెండు నెలల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున అవసరమైన పడకలను సిద్ధం చేయాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

హాస్పిటల్ లో అందిస్తున్న చికిత్స, సదుపాయాలపై నారాయణ ఆస్పత్రి వైద్యులతో మంత్రి సమీక్షించారు. ఆస్పత్రిలో ఉన్న1000 కొవిడ్ పడకలతోపాటూ, అదనపు బెడ్స్ సిద్ధం చేయాలని సూచించారు. బాధితులకు ఇచ్చే ఆహారం నాణ్యతగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఐసీయూ బెడ్స్ సంఖ్యను పెంచాలన్నారు. కరోనా వ్యాధి లక్షణాలతో ఎవరు వచ్చినా వారిని వెనక్కి పంపకుండా చికిత్స అందించాలన్నారు.

ఇదీ చూడండి

మూడు రాజధానుల అంశంపై స్టేటస్ కో కొనసాగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.