ETV Bharat / state

లారీ బోల్తా.. ఒకరు మృతి.. 29 మందికి గాయాలు

author img

By

Published : Jan 9, 2021, 9:06 AM IST

Updated : Jan 9, 2021, 11:36 AM IST

నెల్లూరు శివారులోని జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో ఒకరు మృతి చెందగా.. 29 మంది రైల్వే కూలీలకు గాయాలయ్యాయి. బాధితులంతా తెలంగాణ వాసులుగా గుర్తించారు.

nlr accident
nlr accident

లారీ బోల్తా.. ఒకరు మృతి.. 29 మందికి గాయాలు

నెల్లూరు శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో.. ఒకరు మృతి చెందారు. 29 మందికి తీవ్రగాయాలయ్యాయి. లారీ బోల్తా పడగా ప్రమాదం జరిగినట్లు.. క్షతగాత్రులు చెబుతున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన వీరంతా.. కూలి పని కోసం చిత్తూరు జిల్లా పులిచెర్లలో ఉంటున్నారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా.. సొంతూరికి వెళ్తుండగా ఘటన జరిగింది. గాయాలైనవారు ప్రస్తుతం నెల్లూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు.

లారీ బోల్తా.. ఒకరు మృతి.. 29 మందికి గాయాలు

నెల్లూరు శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో.. ఒకరు మృతి చెందారు. 29 మందికి తీవ్రగాయాలయ్యాయి. లారీ బోల్తా పడగా ప్రమాదం జరిగినట్లు.. క్షతగాత్రులు చెబుతున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన వీరంతా.. కూలి పని కోసం చిత్తూరు జిల్లా పులిచెర్లలో ఉంటున్నారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా.. సొంతూరికి వెళ్తుండగా ఘటన జరిగింది. గాయాలైనవారు ప్రస్తుతం నెల్లూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి:

'భారత్​లో అధికార మార్పిడికి ఆటంకాలుండవు'

Last Updated : Jan 9, 2021, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.