ETV Bharat / state

ఉత్తర కాలువ రైతుకు నిరాశ!

సోమశిల నుంచి రెండో పంటకు సాగునీరందించే క్రమంలో ఉత్తర కాలువ రైతులకు నిరాశే ఎదురుకానుందా? అధికారుల నిర్ణయం ఆ దిశగానే ఉంది. అసలే మొదటి పంట రైతులకు ఊరటనివ్వలేదు. దిగుబడి శాతం తగ్గి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆపై దళారులు, మిల్లర్ల దోపిడీ పోను వారికి మిగిలింది అంతంత మాత్రమే. ఇలాంటి స్థితిలో రెండో పంటకు నీరు విడుదల చేస్తే కొంత ఊరటగా ఉంటుందని అంతా భావించారు. కానీ.. ఉత్తర కాలువ పరిధిలో ఆయకట్టును పరిమితం చేయడంతో వారి ఆశలు.. నిరాశలయ్యాయి.

author img

By

Published : May 15, 2021, 6:10 PM IST

water level in reservoir
జలాశయంలో నీటి నిల్వ

నెల్లూరులోని సోమశిల జలాశయం పరిధిలో నీరు విడుదల చేస్తే సుమారు అయిదు లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. ప్రస్తుతం ఉన్న 51.65 టీఎంసీల నీటితో మొత్తం రెండో పంట పండే అవకాశం ఉంది. కానీ, డెల్టాలో సర్వేపల్లి కాలువ, జాఫర్‌సాహెబ్‌ కాలువ మినహా నీరందిస్తున్నారు. ఇప్పటికే కావలి, కనుపూరు కాలువలకు విడుదల చేయగా... దక్షిణ కాలువ పరిధిలో పూడిక పనులు జరుగుతుండటంతో జాప్యం కానుంది. ఈ కాలువ పరిధిలో 30వేల ఎకరాలకు సాగునీరిస్తామని అధికారులు చెబుతుండగా... ఉత్తర కాలువ పరిధిలో మాత్రం నీటి విడుదల రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా లేదన్నమాట వినిపిస్తోంది. మొదటి పంటకు కాలువ పరిధిలో రాళ్లపాడు వరకు సుమారు 60వేల ఎకరాలకు పైనే సాగునీరిచ్చారు. ప్రస్తుతం కేవలం 23 కిలోమీటరు వరకు 11 వేల ఎకరాలకే అందించాలని నిర్ణయించడం రైతులను నిరుత్సాహానికి గురి చేస్తోంది. తాజా నిర్ణయం వల్ల అనంతసాగరం మండలంలోని కొంత ప్రాంతానికే సాగునీరు పరిమితమవుతుందని, ఆత్మకూరు, అనుమసముద్రంపేట, కలిగిరి, కొండాపురం, రాళ్లపాడు ప్రాంతాలకు అందుబాటులోకి రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పనులతోనే...

సోమశిల జలాశయం పరిధిలో రెండో పంటకు సాగునీరిస్తున్నాం. జాఫర్‌సాహెబ్‌ కాలువ, సర్వేపల్లి కాలువ మినహా డెల్టా మొత్తం ఇస్తున్నాం. పూడిక పనులతో సాగునీరు ఆలస్యంగా ఇవ్వాలని దక్షిణ కాలువ రైతులే కోరారు. ఇక ఉత్తర కాలువ వెడల్పు పనులు ఉన్నాయి. దాంతో 23వ కిలోమీటరు వరకే సాగునీరు ఇస్తున్నాం. ఈ కాలువ ద్వారా సుమారు 11 వేల ఎకరాల్లో సాగునీరిస్తాం. - కృష్ణారావు, ఎస్‌ఈ, సోమశిల ప్రాజెక్టు

ఇస్తే ప్రయోజనమే...

ఉత్తర కాలువ పరిధిలోని చెరువుల్లో కొంత నీరు నిల్వ ఉంది. దానికి తోడు ఇప్పుడు నీటిని విడుదల చేస్తే పంటలు సజావుగానే పండేవి. వేసవి తీవ్రత నేపథ్యంలో భూగర్భ జలాలు పడిపోకుండా ఉండేవి. మెట్ట మండలాలు కావడంతో తాగునీటి సమస్య రాకుండా ఉండేది. కానీ, అధికారులు ఉత్తర కాలువ వెడల్పు పనులు చేపట్టాలనే కారణంతో ఆయకట్టును 11వేల ఎకరాలకే కుదించారు. దాంతో సుమారు 50వేల ఎకరాల్లో పంట సాగు చేసే అవకాశాన్ని ఇక్కడి రైతులు కోల్పోతున్నారు. ఆత్మకూరు, మహిమలూరు, రాజోలు, గుడిపాడు, డీసీపల్లి తదితర చెరువుల్లో కొంత నీరు నిల్వ ఉంది. ఇదంతా ఎండకు ఆవిరి కావడం మినహా.. పంటలకు ఉపయోగపడే స్థితిలేదు. అదే నీటిని విడుదల చేస్తే రెండో పంట పండేది. అధికారులు, నాయకులు తగు చర్యలు తీసుకుని రెండో పంటకు సాగునీరు విడుదల చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: ఆగిన యంత్రం... ఉపాధి గండం

నెల్లూరులోని సోమశిల జలాశయం పరిధిలో నీరు విడుదల చేస్తే సుమారు అయిదు లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. ప్రస్తుతం ఉన్న 51.65 టీఎంసీల నీటితో మొత్తం రెండో పంట పండే అవకాశం ఉంది. కానీ, డెల్టాలో సర్వేపల్లి కాలువ, జాఫర్‌సాహెబ్‌ కాలువ మినహా నీరందిస్తున్నారు. ఇప్పటికే కావలి, కనుపూరు కాలువలకు విడుదల చేయగా... దక్షిణ కాలువ పరిధిలో పూడిక పనులు జరుగుతుండటంతో జాప్యం కానుంది. ఈ కాలువ పరిధిలో 30వేల ఎకరాలకు సాగునీరిస్తామని అధికారులు చెబుతుండగా... ఉత్తర కాలువ పరిధిలో మాత్రం నీటి విడుదల రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా లేదన్నమాట వినిపిస్తోంది. మొదటి పంటకు కాలువ పరిధిలో రాళ్లపాడు వరకు సుమారు 60వేల ఎకరాలకు పైనే సాగునీరిచ్చారు. ప్రస్తుతం కేవలం 23 కిలోమీటరు వరకు 11 వేల ఎకరాలకే అందించాలని నిర్ణయించడం రైతులను నిరుత్సాహానికి గురి చేస్తోంది. తాజా నిర్ణయం వల్ల అనంతసాగరం మండలంలోని కొంత ప్రాంతానికే సాగునీరు పరిమితమవుతుందని, ఆత్మకూరు, అనుమసముద్రంపేట, కలిగిరి, కొండాపురం, రాళ్లపాడు ప్రాంతాలకు అందుబాటులోకి రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పనులతోనే...

సోమశిల జలాశయం పరిధిలో రెండో పంటకు సాగునీరిస్తున్నాం. జాఫర్‌సాహెబ్‌ కాలువ, సర్వేపల్లి కాలువ మినహా డెల్టా మొత్తం ఇస్తున్నాం. పూడిక పనులతో సాగునీరు ఆలస్యంగా ఇవ్వాలని దక్షిణ కాలువ రైతులే కోరారు. ఇక ఉత్తర కాలువ వెడల్పు పనులు ఉన్నాయి. దాంతో 23వ కిలోమీటరు వరకే సాగునీరు ఇస్తున్నాం. ఈ కాలువ ద్వారా సుమారు 11 వేల ఎకరాల్లో సాగునీరిస్తాం. - కృష్ణారావు, ఎస్‌ఈ, సోమశిల ప్రాజెక్టు

ఇస్తే ప్రయోజనమే...

ఉత్తర కాలువ పరిధిలోని చెరువుల్లో కొంత నీరు నిల్వ ఉంది. దానికి తోడు ఇప్పుడు నీటిని విడుదల చేస్తే పంటలు సజావుగానే పండేవి. వేసవి తీవ్రత నేపథ్యంలో భూగర్భ జలాలు పడిపోకుండా ఉండేవి. మెట్ట మండలాలు కావడంతో తాగునీటి సమస్య రాకుండా ఉండేది. కానీ, అధికారులు ఉత్తర కాలువ వెడల్పు పనులు చేపట్టాలనే కారణంతో ఆయకట్టును 11వేల ఎకరాలకే కుదించారు. దాంతో సుమారు 50వేల ఎకరాల్లో పంట సాగు చేసే అవకాశాన్ని ఇక్కడి రైతులు కోల్పోతున్నారు. ఆత్మకూరు, మహిమలూరు, రాజోలు, గుడిపాడు, డీసీపల్లి తదితర చెరువుల్లో కొంత నీరు నిల్వ ఉంది. ఇదంతా ఎండకు ఆవిరి కావడం మినహా.. పంటలకు ఉపయోగపడే స్థితిలేదు. అదే నీటిని విడుదల చేస్తే రెండో పంట పండేది. అధికారులు, నాయకులు తగు చర్యలు తీసుకుని రెండో పంటకు సాగునీరు విడుదల చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: ఆగిన యంత్రం... ఉపాధి గండం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.