ETV Bharat / state

పంటపొలాల్లో పడవలు.. రైతుల కంట కన్నీరు

author img

By

Published : Oct 1, 2020, 8:18 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా వరుణుడి ప్రతాపానికి అన్నదాత అల్లాడిపోతున్నాడు. చేతికొచ్చిన పంట నీట మునుగుతున్నా.. ఏమీ చేయలేక బాధ పడుతున్నాడు. పెన్నా వరదతో నెల్లూరు జిల్లా సంగంలో పొలాల్లోకి భారీగా నీరు చేరింది. పడవలు ఏర్పాటు చేసుకుని కొద్దో గొప్పో ధాన్యాన్ని రైతులు బయటకు తరలిస్తున్నారు.

నెల్లూరు సంగం వద్ద మునిగిన పంట
crop sink in sangam

పంట పొలాల్లోకి పడవలు.. రైతుల కంట కన్నీరు

నెల్లూరు జిల్లా సంగం వద్ద బీరాపేరు వాగు పొంగి పొలాలు నీట మునిగాయి. పెన్నానదికి సోమశిల నుంచి భారీగా వరద రావడంతో సమీప పంటలు జలమయమయ్యాయి. కోతకొచ్చిన వరిని యంత్రాల ద్వారా కోయలేని పరిస్థితి ఏర్పడింది. కూలీల సహాయంతో రైతులు ధాన్యాన్ని పడవల్లో బయటకు తెచ్చి ట్రాక్టర్​లలో తరలిస్తున్నారు.

పది రోజుల వ్యవధిలో రెండు సార్లు వరద రావడంతో సుమారు వెయ్యి ఎకరాల్లో పంట నీటమునిగిందని రైతులు బాధ పడుతున్నారు. అప్పులతో పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంట.. కోత సమయానికి గంగపాలైందని వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంట పొలాల్లోకి పడవలు.. రైతుల కంట కన్నీరు

నెల్లూరు జిల్లా సంగం వద్ద బీరాపేరు వాగు పొంగి పొలాలు నీట మునిగాయి. పెన్నానదికి సోమశిల నుంచి భారీగా వరద రావడంతో సమీప పంటలు జలమయమయ్యాయి. కోతకొచ్చిన వరిని యంత్రాల ద్వారా కోయలేని పరిస్థితి ఏర్పడింది. కూలీల సహాయంతో రైతులు ధాన్యాన్ని పడవల్లో బయటకు తెచ్చి ట్రాక్టర్​లలో తరలిస్తున్నారు.

పది రోజుల వ్యవధిలో రెండు సార్లు వరద రావడంతో సుమారు వెయ్యి ఎకరాల్లో పంట నీటమునిగిందని రైతులు బాధ పడుతున్నారు. అప్పులతో పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంట.. కోత సమయానికి గంగపాలైందని వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కాలువ కథ.. అదే వ్యథ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.