ETV Bharat / state

Investigation: మా పందులను 20 లక్షలకు కమిషనర్‌ అమ్ముకున్నాడు.. గవర్నర్​కు ఫిర్యాదు

author img

By

Published : Apr 21, 2023, 9:46 AM IST

Updated : Apr 21, 2023, 11:56 AM IST

Municipal Commissioner Sold Pigs: పల్నాడు జిల్లాలో మున్సిపల్‌ కమిషనర్‌ తమ పందులను అమ్ముకున్నారని.. పందుల పెంపకందారులు రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఆదేశాలతో ఈ అంశంపై పులిచింతల ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ తహశీల్దార్‌ కార్యాలయంలో కమిషనర్​ను.. బాధితులను విచారించారు. అనంతరం పట్టణ శివారులోని చెక్కవాగు పరిసరాల్లో సందర్శించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Municipal Commissioner Sold Pigs
Municipal Commissioner Sold Pigs

Municipal Commissioner Sold Pigs: పల్నాడు జిల్లా, వినుకొండ పురపాలక సంఘం కమిషనర్ తమ పందులను అమ్ముకున్నాడని పందుల పెంపకం దారుడు దార్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మరికొందరు బాధితులు కలిసి రాష్ట్ర గవర్నర్​కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్.. విచారణ నిమిత్తం పులిచింతల ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్​ శ్రీరాములను నియమించగా.. బుధవారం ఆయన వినకొండ తహశీల్దార్ కార్యాలయంలో బాధితులను.. మున్సిపల్ కమిషనర్ బి. శ్రీనివాస్​లను పిలిపించి విచారణ చేపట్టారు. పందులు పెంపకం ప్రాంతమైన పట్టణ శివారులోని చెక్క వాగు వద్దకు సాయంత్రం సమయంలో వెళ్లి అక్కడ చుట్టు పక్కల పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని.. సేకరించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందని డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు తెలిపారు. ఈ విచారణలో వినుకొండ తహశీల్దార్ కిరణ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

మూడు తరాలుగా పందులు పెంచుకుంటూ జీవనం.. వినుకొండ మునిసిపల్ కమిషనర్ బి. శ్రీనివాసులు సుమారు 20 లక్షలు చేసే పందులను దౌర్జన్యంగా పట్టుకొని అమ్ముకున్నట్లు ఫిర్యాదుదారుడు.. దార్ల కోటేశ్వరావుతో పాటు 70 మంది బాధితులు డిప్యూటీ కలెక్టర్ వద్ద వాపోయారు. గత నాలుగు నెలల క్రితం నాలుగు లారీల్లో 400 పందుల్ని విడతలవారీగా పట్టుకుని తీసుకువెళ్లారని వివరించారు. గొర్రెలు, మేకలు, బర్రెల పెంపకం లాగానే తాము పందుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నామని తెలిపారు. వినుకొండలో సుమారు 100 కుటుంబాలు మూడు తరాలుగా పందులు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. వినుకొండ ప్రాంతంలో పందులు ఉండడానికి వీల్లేదని కమీషనర్ హెచ్చరికలు జారీ చేయడంతో పట్టణానికి దూరంగా చెక్క వాగులో పందుల పెంపకం చేసుకుంటున్నట్లు తెలిపారు.

బెంగళూరు మార్కెట్లో అమ్మకం.. నాలుగు నెలల క్రితం మున్సిపల్ కమిషనర్ సుమారు 40 మంది వ్యక్తులను పిలిపించి పందులను పట్టించి లారీల్లో తరలించాడని తెలిపారు. అడ్డుకున్న తమను, మా కుటుంబ సభ్యులను పోలీసులతో బెదిరించి స్టేషన్లలో కూర్చోబెట్టి పందులు పట్టుకున్నారని అన్నారు. సుమారు 400 పందుల్ని పట్టుకుని బెంగళూరు మార్కెట్లో అమ్ముకున్నట్లు వివరించారు. ఒక్కొక్క పంది విలువ 7 నుంచి 12 వేల వరకు ఉంటుందని, పట్టుకు వెళ్ళిన పందులు విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని తెలిపారు. పందుల పెంపకం తమ వృత్తి అని, పందులను కొనుగోలు చేసుకుని పెంచి అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటామని.. 400 పందులను తీసుకువెళ్లడంతో తమ కుటుంబాలు అప్పుల పాలై తీవ్రంగా నష్టపోయామని తెలిపారు. పందులను పట్టుకొని అమ్ముకున్న కమిషనర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు అధికారులను కోరారు.

ఇవీ చదవండి:

Municipal Commissioner Sold Pigs: పల్నాడు జిల్లా, వినుకొండ పురపాలక సంఘం కమిషనర్ తమ పందులను అమ్ముకున్నాడని పందుల పెంపకం దారుడు దార్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మరికొందరు బాధితులు కలిసి రాష్ట్ర గవర్నర్​కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్.. విచారణ నిమిత్తం పులిచింతల ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్​ శ్రీరాములను నియమించగా.. బుధవారం ఆయన వినకొండ తహశీల్దార్ కార్యాలయంలో బాధితులను.. మున్సిపల్ కమిషనర్ బి. శ్రీనివాస్​లను పిలిపించి విచారణ చేపట్టారు. పందులు పెంపకం ప్రాంతమైన పట్టణ శివారులోని చెక్క వాగు వద్దకు సాయంత్రం సమయంలో వెళ్లి అక్కడ చుట్టు పక్కల పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని.. సేకరించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందని డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు తెలిపారు. ఈ విచారణలో వినుకొండ తహశీల్దార్ కిరణ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

మూడు తరాలుగా పందులు పెంచుకుంటూ జీవనం.. వినుకొండ మునిసిపల్ కమిషనర్ బి. శ్రీనివాసులు సుమారు 20 లక్షలు చేసే పందులను దౌర్జన్యంగా పట్టుకొని అమ్ముకున్నట్లు ఫిర్యాదుదారుడు.. దార్ల కోటేశ్వరావుతో పాటు 70 మంది బాధితులు డిప్యూటీ కలెక్టర్ వద్ద వాపోయారు. గత నాలుగు నెలల క్రితం నాలుగు లారీల్లో 400 పందుల్ని విడతలవారీగా పట్టుకుని తీసుకువెళ్లారని వివరించారు. గొర్రెలు, మేకలు, బర్రెల పెంపకం లాగానే తాము పందుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నామని తెలిపారు. వినుకొండలో సుమారు 100 కుటుంబాలు మూడు తరాలుగా పందులు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. వినుకొండ ప్రాంతంలో పందులు ఉండడానికి వీల్లేదని కమీషనర్ హెచ్చరికలు జారీ చేయడంతో పట్టణానికి దూరంగా చెక్క వాగులో పందుల పెంపకం చేసుకుంటున్నట్లు తెలిపారు.

బెంగళూరు మార్కెట్లో అమ్మకం.. నాలుగు నెలల క్రితం మున్సిపల్ కమిషనర్ సుమారు 40 మంది వ్యక్తులను పిలిపించి పందులను పట్టించి లారీల్లో తరలించాడని తెలిపారు. అడ్డుకున్న తమను, మా కుటుంబ సభ్యులను పోలీసులతో బెదిరించి స్టేషన్లలో కూర్చోబెట్టి పందులు పట్టుకున్నారని అన్నారు. సుమారు 400 పందుల్ని పట్టుకుని బెంగళూరు మార్కెట్లో అమ్ముకున్నట్లు వివరించారు. ఒక్కొక్క పంది విలువ 7 నుంచి 12 వేల వరకు ఉంటుందని, పట్టుకు వెళ్ళిన పందులు విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని తెలిపారు. పందుల పెంపకం తమ వృత్తి అని, పందులను కొనుగోలు చేసుకుని పెంచి అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటామని.. 400 పందులను తీసుకువెళ్లడంతో తమ కుటుంబాలు అప్పుల పాలై తీవ్రంగా నష్టపోయామని తెలిపారు. పందులను పట్టుకొని అమ్ముకున్న కమిషనర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు అధికారులను కోరారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 21, 2023, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.